పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో …
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …
పినరయి విజయన్ సుదీర్ఘ అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …
error: Content is protected !!