కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ చేసే బెంచ్ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉన్న త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును కేటాయించారు. అయితే తాజాగా పంచాయితీ కేసులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో …
తమిళ రాజకీయాలను అర్ధ శతాబ్దం పాటు శాసించిన డీఎంకే పార్టీ అధినేత ముత్తువేల్ కరుణానిధి తెలుగువాడే. ఇది నిజమే. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో పుట్టారు. ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణా మూర్తి. ఆయన పద్నాలుగేళ్ళ వయసు నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరుణానిధి పుట్టకమునుపే వారి …
ఏపీ లో పంచాయితీ ఎన్నికలు ముందెన్నడూ లేని చిత్రమైన పరిస్థితులను తెర పైకి తెచ్చాయి. ఈ ఎన్నికలే యావత్తు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వైపు .. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కరే ఒకవైపు నిలిచేలా చేశాయి. ఎన్నికలు పెట్టాల్సిందే అని కమీషనర్ .. ఇపుడు కాదు అని ప్రభుత్వం పంతాలకు పోయాయి …
“రష్యా అధ్యక్షుడి రహస్య భవనం ఇదే” అంటూ ఒక వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. వీడియో అప్ లోడ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే దాదాపు 5 కోట్ల మంది దాన్ని చూసారు. పుతిన్ కట్టించిన అత్యంత విలాసవంతమైన భవనం అని ఆయన విమర్శకుడు అలెక్సీ నవాల్ని దాన్ని అంతర్జాలంలో పెట్టాడు. నల్లసముద్రం ఒడ్డున పుతిన్కు ఒక …
ఏపీ లో పంచాయితీ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసి … తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేమని … కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఎన్నికలు పెట్టి తమ బతుకులను అభద్రతలోకి నెట్టవద్దని ఉద్యోగ …
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. ఎన్నికలు నిర్వహించవచ్చుఅని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని తేల్చి చెప్పన నేపథ్యంలో నిమ్మగడ్డ జోరు పెంచారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే కొందరు అధికారులపై ఆయన వేటు వేసారు. 9 …
Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …
మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్ … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని …
తెలుగు దేశం పార్టీ అధినేత ఇటీవల ప్రజలను ,కార్యకర్తలను విష్ చేసే విధానం మార్చారు. గతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపటం కొన్ని ఏళ్లుగా చంద్రబాబు కున్న అలవాటు. అయితే 2012 లో ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం …
error: Content is protected !!