అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Unfinished film……………………………………. నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన జానపద చిత్రం “విక్రమసింహా” ఎందుకు ఆగిపోయిందో ? ఖచ్చితమైన సమాచారం ఎవరికి తెలీదు. వాస్తవాలు తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ … నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి… ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఇపుడు సజీవంగా లేరు. బాలకృష్ణ ఆ సినిమా గురించి బయట ఏమి మాట్లాడలేదు. 60 …
ఏపీ లో పంచాయితీ ఎన్నికలు ముందెన్నడూ లేని చిత్రమైన పరిస్థితులను తెర పైకి తెచ్చాయి. ఈ ఎన్నికలే యావత్తు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వైపు .. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కరే ఒకవైపు నిలిచేలా చేశాయి. ఎన్నికలు పెట్టాల్సిందే అని కమీషనర్ .. ఇపుడు కాదు అని ప్రభుత్వం పంతాలకు పోయాయి …
“రష్యా అధ్యక్షుడి రహస్య భవనం ఇదే” అంటూ ఒక వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. వీడియో అప్ లోడ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే దాదాపు 5 కోట్ల మంది దాన్ని చూసారు. పుతిన్ కట్టించిన అత్యంత విలాసవంతమైన భవనం అని ఆయన విమర్శకుడు అలెక్సీ నవాల్ని దాన్ని అంతర్జాలంలో పెట్టాడు. నల్లసముద్రం ఒడ్డున పుతిన్కు ఒక …
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు బిల్లీ బార్. న్యూ జెర్సీ కి చెందినవాడు. వయసు 63 వరకు ఉండొచ్చు. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లో 43 ఏళ్లుగా జీవిస్తున్నాడు. ఒంటరి తనమంటేనే భయంకరం .. అందులో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంటే ఇక చెప్పనక్కర్లేదు. మరో వైపు ఎటు చూసినా మంచు పర్వతాలు. …
ఏపీ లో పంచాయితీ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసి … తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేమని … కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఎన్నికలు పెట్టి తమ బతుకులను అభద్రతలోకి నెట్టవద్దని ఉద్యోగ …
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. ఎన్నికలు నిర్వహించవచ్చుఅని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని తేల్చి చెప్పన నేపథ్యంలో నిమ్మగడ్డ జోరు పెంచారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే కొందరు అధికారులపై ఆయన వేటు వేసారు. 9 …
తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న మర్మమేంటో చాలాకాలం వరకు ఎవరికి తెలీదు. ఒకసారి …
ఆధ్యాత్మిక గురువుగా , అవదూతగా కాశీనాయన ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబం. యుక్తవయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్యనేర్పుతూ కొంతకాలం గడిపారు. తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే …
Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …
error: Content is protected !!