సరస్వతి నది పుష్కర యాత్ర..16 వేలకే !!

Sharing is Caring...
AYODHYA KASHI PUNYA KSHETRA YATRA (Saraswati Pushkaralu Special )..

మే నెల 15వ తేదీ నుంచి ‘సరస్వతి’ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోIRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇది 9 రాత్రులు,10 రోజుల యాత్ర…పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి క్షేత్రాలను ఈ టూర్ లో సందర్శించవచ్చు.ఈ టూర్ మే నెల 8వ తేదీన మొదలవుతుంది.. మే 17 న ముగుస్తుంది.

DAY 1….  ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. బోనగిరి, జనగామ , ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.ప్యాకేజీ బుక్ చేసుకున్న యాత్రీకులు ఎక్కడ నుంచైనా రైలు ఎక్కవచ్చు. దిగేటప్పుడు కూడా వారు ఎంచుకున్న స్టేషన్ లో దిగవచ్చు. 

DAY 2…. ఉదయం తొమ్మిది గంటలకు పూరీ పట్టణం సమీపంలోని మల్తీపత్పూర్ స్టేషన్ కి  చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పూరీకి వెళతారు. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. లంచ్ తర్వాత జగన్నాథ ఆలయాన్ని సందర్శస్తారు. రాత్రి బస పూరీలో. 

DAY 3… బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ రూమ్ చెక్ అవుట్ చేసి కోణార్క్ ప్రయాణం. అక్కడ సూర్య దేవుని ఆలయం సందర్శిస్తారు. తర్వాత మల్తీపత్పూర్ స్టేషన్ కి  చేరుకుంటారు. అక్కడ రైలు ఎక్కి గయకు బయలు దేరుతారు..

DAY 4…. ఉదయం తొమ్మిదిన్నరకు గయకు చేరుకుంటారు.  రైలు దిగి బోధ్ గయ కు వెళ్లి హోటల్ రూమ్ లో చెక్ ఇన్ అవుతారు. లంచ్ చేసిన తర్వాత విష్ణుపాద ఆలయదర్శనం చేసుకుంటారు. రాత్రి బస బోద్ గయలోనే.

DAY 5… ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి రూమ్ చెక్ అవుట్ చేసి ఎనిమిది గంటలకు గయ స్టేషన్ లో రైలెక్కాలి. మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసికి చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సారనాథ్ కి వెళతారు. రాత్రి బస అక్కడే.

DAY  6…  ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత వారణాసి కి ప్రయాణం. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల దర్శనం. సాయంత్రం గంగా హారతి.. రాత్రి బస వారణాసిలో..  ఇక్కడ ఫుల్ డే సైట్ సీయింగ్.. అవకాశాన్ని బట్టి ముఖ్యమైన వాటిని దర్శించుకుంటారు.  

DAY  7..  ఉదయం వారణాసిలో రూమ్ చెక్ అవుట్ చేసి ఏడు గంటలకు రైలెక్కాలి. అయోధ్యకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 12.30కు అయోధ్యధామ్ స్టేషన్ కు చేరుకుంటారు. రామజన్మభూమి, హనుమానగరి దర్శనం చేసుకుంటారు.. సాయంత్రం సరయు నదిలో హారతిని తిలకిస్తారు. రాత్రి భోజనం తర్వాత అయోధ్యధామ్ స్టేషన్ లో రైలెక్కాలి.  ప్రయాగ్ రాజ్ కి బయలు దేరుతారు.

DAY  8 … తెల్లవారు జామున 4.30 గంటలకు ప్రయాగ సంగమం రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తారు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని .. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. తిరుగు ప్రయాణం మొదలైనట్టే. నైట్ అంతా ప్రయాణమే.  

DAY 9 …  రోజంతా ప్రయాణమే ..

DAY  10…  రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడం తో యాత్ర ముగుస్తుంది.  ప్రయాణంలో ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే)అందిస్తారు. ఈ ప్యాకేజి లో ప్రయాణీకులకు ప్రయాణ బీమా సదుపాయం ఉంది.స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌ల సేవలు అందిస్తారు. ఇతర ఖర్చులు ప్రయాణీకులు భరించాలి.

ఇతర వివరాలకోసం కింది లింక్ ను క్లిక్ చేయండి .. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!