అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
కొన్ని విషయాలు, వివిధ సమాచారాన్ని క్రోడీకరిస్తే మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అవగతమౌతోంది. 1) గత వంద సంవత్సరాల్లో (1920-2020) అమెరికన్ ప్రెసిడెంట్లను గమనిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తమ రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హెర్బర్ట్ హూవర్ (1929-33)… ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో, జిమ్మీ కార్టర్ (1977-81)… రోనాల్డ్ …
గువ్వల చెరువు పాలకోవా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. స్వీట్లు ఎన్ని ఉన్నా ఈ పాలకోవా రుచే వేరు. కమ్మని పాలకోవా తినాలంటే గువ్వల చెరువుకెళ్లాల్సిందే. ఇంతకూ ఎక్కడ ఉంది ఆ గువ్వల చెరువు. కడప జిల్లా రామాపురం మండలం లో ఉంది. ఈ పాలకోవా టేస్ట్ కేవలం కడప కే పరిమితం కాలేదు. అన్ని …
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో …
ఆశ్చర్యంగా ఉంది కదా? అవును కాని ఇది నిజం. ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏమిటి? అది చేయాల్సిన పని కాదు కదా. కానీ చేస్తున్నది.లాభ నష్టాలతో ముడిపెట్టి ప్రజా రవాణాను కుదించడం, ప్రయాణ అవకాశాలను తగ్గించడం అది కూడా ప్రభుత్వ రంగంలోని రైలు రవాణాలో. భారత్ లాంటి వర్ధమాన దేశంలో ప్రజలకున్న చవక రవాణా సాధనం …
దుబ్బాక రాజకీయాలు రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఓటర్ల …
బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన …
ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన,కార్య నిర్వాహక వ్యవస్థలకు దిక్సూచి గా నిలిచే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండనవసరం లేదా? 70 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రశంశనీయమైన కృషి చేసింది.కానీ ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పద పాత్ర,మరికొన్ని వివాదాలు మినహా మొత్తం మీద న్యాయంగానే వ్యవహరించిదనే భావించవచ్చును. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో,రాజ్యాంగ పరిధికి అతీతంగా చట్ట సభలు …
Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …
error: Content is protected !!