అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
లక్ష్మివిలాస్ బ్యాంక్ అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం బ్యాంకు ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్ధేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ ని వేసింది. మూడురోజుల క్రితం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ ఎండీ , 6 గురు డైరెక్టర్ల ,ఆడిటర్ల నియమాకాలను వాటాదారులు తిరస్కరించారు. దీంతో బ్యాంకు ఆలనాపాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. బ్యాంకును అప్పుల ఊబిలో దించారనే కోపంతో వాటాదారులు …
“కులములోన ఒకడు గుణవంతుడుండెనా… కులము వెలయు వాని గుణము చేత..!” అన్నీ కులాలు ఇష్టపడే పద్యం..ఏ మతమైనా సమ్మతించే భావం..! మనిషి చచ్చిపోతే స్మశానంలో పూడ్చేటప్పుడు దూరం నుండే కుక్కలు., నక్కలూ చూస్తుంటాయి.. అందరూ వెళ్ళాక అవకాశం ఉంటే గుంట తవ్వి పీక్కుతినవచ్చనీ.. వాటిల్లో కూడా విచక్షణ ఉంటుంది. ఎప్పుడు దూరంగా ఉండాలో… ఎప్పుడు తినాలో …
రామజన్మభూమి వివాదం పరిష్కారమై మందిర నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం మొదలైంది. మధుర కోర్టులో ఈమేరకు శ్రీకృష్ణ విరాజ్మాన్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు ను తొలగించి 13. 37 ఎకరాల స్థలాన్ని కృష్ణమందిరం కోసం కేటాయించాలని శ్రీకృష్ణ విరాజ్మన్ డిమాండ్ చేస్తోంది . ఈద్గా మసీదు …
ఇంద్రుడు శుక్రవారం తన సభలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఊహించని అతిధి వస్తున్నారని… అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా నృత్య గాన మేళాలతో స్వాగతం పలకాలని ఇంద్రుడు ఆదేశాలు జారీ చేశారు… ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అని అందరూ ఆరా …
సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది …
పార్లమెంట్ ఆమోదించిన విదేశీ విరాళాల సవరింపు చట్టాన్ని దేశంలోని పలు స్వచ్చంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం మూలాన ఉద్యోగుల వేతనాలు చెల్లించడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులు లేకపోతే … వారికి సరిపడా జీతాలు ఇవ్వలేకపోతే ఎన్జీవో ల మనుగడే ప్రశ్నార్ధకం గా …
పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత… ఆమె పేరిట గుడి కడతా అన్నారు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. నిత్యం వివాదాలతో సావాసం …
ఉద్యమ సమయాల్లో ఉద్రిక్తతలు సర్వ సహజం. కార్యకర్తలు లక్ష్యం వైపు దూసుకుపోవాలని ….పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కాల్పులు చోటు చేసుకుంటాయి. ఆ రోజు కళ్ళముందే కాల్పుల ఘటన జరిగింది. అదేమిటంటే …… సరిగ్గా 21 ఏళ్ళ క్రితం . 2000 సంవత్సరం .. ఆగస్టు 28. ఆరోజు కాంగ్రెస్, వామపక్షాలు “అసెంబ్లీ …
అయ్యా …….. గారూ నమస్కారం … వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్ ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను …
error: Content is protected !!