అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. …
హిందూ మతం ప్రమాదంలో ఉందా. సనాతన ధర్మానికి ముప్పు రాబోతుందా.ఇది కేవలం రాజకీయ నినాదం అని ఒక వర్గం,కాదు కళ్ళముందరి నిజాన్నిచూడలేని స్థితిలో హిందువులు బతుకుతున్నారు అని ఇంకో వర్గం వాద ప్రతివాదాలు చేస్తుంటాయి. వారు దేని ఆధారంగా ఇలాంటి వాదాలు మొదలుపెట్టారు, వారిలోఎవరి వాదన నిజం అన్నది పక్కన పెడితే……. ఒకానొక సందర్బంలో దేవుడు అన్న …
యుద్ధం ఎక్కడ జరిగినా .. .. ఎందుకు జరిగినా.. సైనికుల కర్కశత్వానికి బలైపోయేది మహిళలూ ..పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చేయంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటుగా మారింది. యుద్ధం లో కూడా అదే తంతు కొనసాగుతోంది. బలహీనులపై దాడులు సర్వ సాధారణంగా మారాయి. …
మన దేశంలోని రైళ్లలో జనరల్ బోగీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎపుడూ అవి కిటకిట లాడుతుంటాయి. ఇక రైల్వే స్టేషన్లలో టిక్కెట్ల కోసం చాంతాడు క్యూల సంగతి కూడా తెలిసిందే. ఆ క్యూలో నిలబడి టికెట్ సంపాదించి .. బోగీలో ఎక్కితే సీటు కూడా దొరకదు. ఈ తిప్పలు అందరికి తెలిసినవే. వీటిని తొలగించడం కోసం …
Chernobyl……………………………. సరిగ్గా 35 ఏళ్ల … మూడురోజుల క్రితం 1986 ఏప్రిల్ 26న సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలితంగా 134 …
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే …
సమాజంలో సేవాభావంతో పనిచేసేవారు ఎందరో ఉన్నారు.ఒక్కొక్కరు ఒక్కో తరహాలో స్పందిస్తుంటారు. ఈ చారుబాల బారిక్ కూడా అదే కోవలో మనిషి. తన గ్రామ ప్రజలకు ఏ చిన్నకష్టమొచ్చినా స్పందిస్తుంది. వెంటనే తానున్నానని అండగా నిలబడుతోంది. ఒడిశాకు చెందిన చారుబాలను దీపా అని కూడా పిలుస్తారు. ఏ సమస్యనైనా ఒక్క ట్వీట్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి …
ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు మలిష్క ..పేరు వెరైటీ గా ఉంది కదా ! మనిషి కూడా అంతే. సామాజిక సమస్యల పట్ల బాగా స్పందిస్తుంది. ముంబై అధికారులకు ఈ మలిష్క అంటే హడల్. తాను రేడియో జాకీ గా చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తే ,,దుర్గంధం భరించలేక ముక్కు మూసుకుని అక్కడి …
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …
error: Content is protected !!