ఎవరీ మమిత బైజు ?

Sharing is Caring...

A new heroine with beauty..………………………………………..

‘ప్రేమలు’ సినిమాలో రీనూ  పాత్రలో నటించి, మెప్పించిన  మమిత బైజు పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మమిత అందం, అభినయం సినిమాలో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూ పాత్రలో ఒదిగిపోయి ఎంతోమందికి మమిత అభిమాన నటిగా మారింది. 

ఈ సినిమాతో ఆమె ఒక్కరోజులోనే స్టార్ అయిపోయింది. దర్శకుడు రాజమౌళి సైతం  ఆమెను పొగడకుండా ఉండలేకపోయారు. ‘గీతాంజలి’ సినిమాలో గిరిజ, ‘ఫిదా’ లో  సాయి పల్లవి ప్రేక్షకులని ఎంతగా అలరించారో ఇప్పుడు ‘ప్రేమలు’ సినిమాలో మమిత బైజు కూడా అంతలా ప్రేక్షకులను అలరించారు.

రాజమౌళి ప్రశంసలతో ఎవరీ మమిత అంటూ చాలా మంది నెట్లో వెతుకుతున్నారు. ‘న్యూ క్రష్‌’, ‘క్యూట్‌’ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. నేరుగా తెలుగులో నటించకపోయినా డబ్బింగ్‌ చిత్రంతో ఇంతటి క్రేజ్‌ మమిత సొంతం చేసుకోవడం విశేషం

‘ప్రేమలు’ మలయాళంలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. ‘ప్రేమలు’ మలయాళం సినిమా అయినా, ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం హైదరాబాదులో చిత్రీకరించారు.

ఇంతకూ మమిత ఎవరంటే మలయాళం నటి. పూర్తి పేరు మమిత బైజు ..  తల్లిదండ్రులు డాక్టర్ బైజు కృష్ణన్, మణి. ఆమె మొదటి సినిమా మలయాళంలో ‘సర్వోపరి పలక్కరన్’. 2017లో మొదటి సినిమా చేసినా, 2021  ‘ఆపరేషన్ జావా’  అనే సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది.

మమిత ఇప్పుడు  బీఎస్సీ సెక్రెడ్ హార్ట్ కాలేజ్ లో చదువుతోంది. అల్లు అర్జున్‌ అంటే మమిత కు ఎంతో ఇష్టం..ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తుందట. మమితకు కోలీవుడ్‌లో వరుసగా  అవకాశాలు వస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సరసన ఆమె నటించిన ‘రెబల్‌’ మార్చి 22న విడుదల కాబోతున్నది. విష్ణు విశాల్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో మమిత హీరోయిన్‌గా నటించ బోతోందని పరిశ్రమ వర్గాల సమాచారం. త్వరలో తెలుగు సినిమాల్లో కూడా ఛాన్స్ లభించే సూచనలున్నాయి. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!