ఆతిధ్య రంగంలోకి అంబానీ .. బ్రిటన్ లో పెద్ద టూరిస్ట్ హబ్ !

ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని  విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. …

బతికి ఉండగానే.. మరణించారని ప్రచారం చేసిన మీడియా!

లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. …

ఆమె పాటలన్నీ అమృత గుళికలే!

ఒకటా ? రెండా ? మూడా ? కొన్ని వేల పాటలు…. దేనికదే ఒక ప్రత్యేకత. సుస్వర వాణి, అద్భుత గాయని జానకి పాటలు వింటుంటే తనువు మైమర్చిపోతుంది. మనసు పులకరిస్తుంది ..  నీ లీల పాడెద దేవా … పగలే వెన్నెలా…జగమే ఊయల… ఆడదాని ఓరచూపుకు.. జగాన ఓడిపోని ధీరుడెవ్వడు… నీలి మేఘాలలో…పూవులు పూయును …

మురిపాలలో ముచ్చటైన జంట !

పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. …

ట్విట్టర్ లో రెట్టలు వేస్తున్న నిత్యానందుడు !

జాడ లేకుండా పోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ట్విట్టర్ లో ఖాతా తెరిచి జోకులు పేలుస్తున్నాడు.  కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ దేశమైన కైలాష్ ద్వీపంలోకి భారతీయ భక్తులకు ప్రవేశం లేదని ప్రకటించారు.  భారత్ తో పాటు బ్రెజిల్, ఈ యూ, మలేషియా భక్తుల ప్రవేశం పై నిషేధం విధిస్తున్నట్టు తన ప్రెసిడెన్షియల్ మెండేట్ లో …

బాక్సాఫీస్ మొనగాడు !!

హీరో కృష్ణ .. దర్శకుడు కె రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ఊరికి మొనగాడు.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం గా ఉండటం .. కథనం… …

ఊడలు దిగి విస్తరిస్తున్న కూటనీతి !

భండారు శ్రీనివాసరావు .……………………………………… పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి …

ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ !

“అందరికి ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ .. రేపు నేను మిమ్మల్నిఇక్కడ మళ్ళీ కలవక పోవచ్చు.నా శరీరం ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఆత్మ శాశ్వతం. అందరూ జాగ్రత్తగా ఉండండి “అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన ఆమె కొద్దీ గంటల్లోనే మరణించారు. మరణాన్ని ఆమె ముందే ఊహించారు. ఆమె చెప్పినట్టుగా మరుసటి రోజు ఉదయాన్ని …

“తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం”.. తేల్చేసిన టీటీడీ!

హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయుడి జన్మ స్థలం  తిరుమల గిరుల్లోని అంజనాద్రే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెప్పిన విధంగా ఇవాళ టీటీడీ ప్రకటన చేసింది. పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధన చేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ …
error: Content is protected !!