కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్ళీ వార్తల్లో కెక్కారు. “తాను చనిపోలేదని .. బతికేఉన్నా”నని నిత్యానంద స్వామి అంటున్నారు. తాను సమాధిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారు పడవద్దని ప్రకటన చేశారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నానని చెప్పుకుంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తా కథనాలు ప్రచారంలో కొచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన …
President Election ………………………………….. రాష్ట్ర పతి ఎన్నిక ఈసారి రసవత్తరం గా జరగనుంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఏ ఇబ్బంది లేదు. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదనే అంటున్నారు. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలతో …
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. …
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలకు తెగించి తమ సేనలకు సాయం చేశారు. రష్యా దళాల ఖచ్చితమైన కదలికల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందించారు. ఫలితంగా కీవ్ ను ఆక్రమించుకొనేందుకు వచ్చిన రష్యా సేనలకు హైవే-7 పై తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో రష్యా సేనలు వెనుదిరిగాయి. పుతిన్ సేనకు అతి పెద్ద ఓటమి …
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ పనితీరుపై పూర్తి …
ఉక్రెనియన్ల సాయం కోసం నిధుల సమీకరణకు బ్రిటన్ నడుం బిగించింది. ఇందుకోసం తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఖాకీ జాకెట్.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం. లండన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రారంభ ధర 50 వేల పౌండ్ల …
Sk.Zakeer……………………………………………….. దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది.రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ అది రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా …
ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా ఉక్రెయిన్ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. …
రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. మరో వైపు చిన్నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోకి రానీయకూడదని పళని స్వామి , పన్నీర్ సెల్వమ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత, అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తిరిగి పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం …
error: Content is protected !!