ఇంధన రంగ దిగ్గజం ఓ ఎన్ జీ సి ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. పెరిగిన చమురు ధరలు కంపెనీ లాభాలను వృద్ధి చేశాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.497 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభం 772 శాతం పెరిగి రూ. 4,335 కోట్లకు చేరుకుంది. ఇక స్థూల ఆదాయం 77 శాతం పెరిగి 23022 కోట్లకు చేరింది.
గత ఏడాది తొలి త్రైమాసికంలో ముడి చమురు బ్యారెల్ కు 28. 87 డాలర్ల ధర పలకగా..ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పై బ్యారల్ కి 65. 59 డాలర్ల చొప్పున ధర లభించింది. ఇక చమురు ఉత్పత్తి మాత్రం ఈ త్రైమాసికంలో తగ్గింది. మొదటి త్రైమాసికంలో 5 శాతం తక్కువగా 5. 4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. ఇక గ్యాస్ ఉత్పత్తి కూడా నాలుగు శాతానికి పైగా తగ్గింది. సొంత క్షేత్రాల నుంచి 4. 6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా జాయింట్ వెంచర్ల ద్వారా 0. 55 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది.
ఇక కంపెనీ షేర్లు రూ 115 ధర వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 52 వారాల గరిష్ట ధర 128 కాగా కనిష్ట ధర 64 మాత్రమే. దీర్ఘ .. మధ్య కాలాలకు ఈ షేర్లు అనుకూలమైనవి. ప్రస్తుత ధర వద్ద కాకుండా షేర్ ధర తగ్గినపుడు కొనుగోలు చేయవచ్చు. బ్రోకింగ్ సంస్థలు కొనుగోలు చేయమని సిఫారసు చేస్తున్నాయి.
ఫలితాలు బాగున్నప్పటికీ షేర్ ధరలో కదలిక తక్కువగా కనబడుతోంది.కొన్నిబ్రోకింగ్ సంస్థలైతే షేర్ ధర స్వల్ప కాలంలో రూ . 145….. 155….. 130 లకు చేరుకునే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బాగా తక్కువ ధరలు 70-80-90 ల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించి … ధరలు తగ్గినపుడు మళ్ళీ కొనుగోలు చేయవచ్చు.
————-KNM