Values are falling…………….
అపుడపుడు సినిమా కథల్లోని ఘటనలు… నిజజీవితాల్లో జరుగుతుంటాయి.శుభలగ్నం తెలుగు సినిమాలో కథానాయిక తన భర్తను ప్రేమించిన మహిళకు రూ.కోటికి విక్రయిస్తుంది. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలోని మండ్య సమీప గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ పడకపై ఉన్నప్పుడు నేరుగా నిలదీసింది. ఆడవాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ పంచాయితీకి చేరింది.
‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించి.. తీసుకువెళ్లు’ అని ఆ మహిళ తేల్చిచెప్పింది.
అలాంటి భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, అతన్ని నువ్వే ఉంచుకోవాలని ఆ ఇల్లాలు చెప్పింది. ఒక నెల సమయం ఇస్తే ఆ నగదు ఇస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.