ఆ మెరుపు తార ఇప్పుడేమి చేస్తున్నారో ?

Sharing is Caring...
Bharadwaja Rangavajhala ……………………….

తెలుగు సినిమా మర్చిపోలేని నటి. ఖైదీలో ” రగులుతోంది మొగలిపొద” పాటకు అదిరిపోయే మూమెంట్స్ ఇచ్చిన ఆ మాధవే….”వేణువై వచ్చాను భువనానికీ”…అంటూ తన అభినయంతో హృదయాలను తడిమింది. ఎంతటి వేరియేషన్? ఆ వేరియేషన్ త్రూ అవుట్ కెరీర్ మెయిన్ టెయిన్ చేయగలగడం మాధవి స్పెషాలిటీ.

బాలచందర్ ‘అపూర్వరాగంగళ్’ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడు ఒరిజినల్ లో జయసుధ చేసిన కారక్టర్ కు తగ్గ నటి కోసం వెతుకుతున్నారు దర్శకరత్న దాసరి. అనుకోకుండా రవీంద్రభారతిలో జరిగిన ఓ డాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లారాయన.

నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని చూసి ఓకే అనేసుకున్నారు. విజయలక్ష్మి అనే పేరును మార్చారు. అలా ‘తూర్పుపడమర’ చిత్రంతో తెరంగేట్రం చేసింది మాధవి.’తూర్పు పడమర’లో మాధవి నటన చూసిన వాళ్లెవరూ కొత్తమ్మాయిగా ఫీలవలేదు. డైలాగ్ డెలివరీతో సహా చాలా అనుభవం ఉన్న ఆర్టిస్ట్ గా అనిపించింది.

అదే బాలచందర్ ను ఎట్రాక్ట్ చేసింది. తన ‘మరో చరిత్ర’లో ఓ ప్రధాన పాత్ర కోసం మాధవిని అప్రోచ్ అయ్యారు. కమల్ హసన్ కాంబినేషన్ లో మాధవి నటన నిజంగా అద్భుతం. ముఖ్యంగా స్వప్న ను బాలు అపార్థం చేసుకున్నాడని తెల్సినప్పుడు తన రియాక్షన్ మాధవి చక్కగా పలికించింది.

అదే పాత్రను హిందీలో’ ఏక్ దుజే కేలియే’లో చేసింది. ఆ సినిమా తర్వాత స్వయంగా కమల్ హసనే చాలా సినిమాలకు మాధవిని రికమండ్ చేశారు.నటిగా తానేమిటో ప్రూవ్ చేసుకున్న మాధవికి తొలిరోజుల్లో తెలుగు ఇండస్ట్రీ హీరో చెల్లి పాత్రలు ఆఫర్ చేసింది. బాపుగారి ‘స్నేహం’లో అందమైన పాత్ర చేసింది. చంద్రమోహన్ లాంటి హీరోలతో కనిపించేది.

నెమ్మదిగా ‘చట్టానికి కళ్లు లేవు’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ మూవీలతో మాధవి బిగ్ హీరోయిన్ అయ్యింది. ‘ఖైదీ’లో చిరంజీవితో పోటీ పడి మాధవి చేసిన ‘విశ్వామిత్ర తపోభంగం’ డాన్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మాధవిలోని డాన్సింగ్ టాలెంట్ ప్రపంచానికి అర్ధం అయ్యింది.చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు తదితర హీరోలతోనూ జోడీ కట్టింది మాధవి.

కమల్ హసన్ తో భారతీరాజా దర్శకత్వంలో మాధవి చేసిన ‘టిక్ టిక్ టిక్’ మాధవికి గ్లామరస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అలాగని ఆ తరహా పాత్రలతోనే కంటిన్యూ కాలేదు. సీరియస్ రోల్సూ చేసింది.

మాధవిలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన చిత్రం మాత్రం ‘మాతృదేవో భవ’. హిందీలో అమితాబ్ బచన్ తో సహా చాలామంది హీరోలతో నటించింది. మాధవి.. అంధా కానూన్. గిరఫ్తార్ లో అమితాబ్ తో చేసింది. దాదాపు 30 సినిమాలు  రాజేస్ ఖన్నాతో స్వర్గ్, కుదాయి లో మిధున్ చక్రవర్తిలో 4 సినిమాలు, సంజయ ఖన్నా, ధర్మేంద్ర తోనూ నటించింది.

ఆతర్వాత బిగ్ బాస్, తదితర చిత్రాల్లో ఆమె నటించారు.మాధవికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ . స్వామి రామాను మాధవి ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు. ఒకసారి అమితాబ్ బచ్చన్తో కలిసి అమెరికాలో షో ఇవ్వడానికి వెళ్లినపుడు స్వామి రామ తన శిష్యుడైన రాల్ఫ్ శర్మ గురించి చెప్పి అతన్ని కలవమన్నారు. ఆమె కలిసింది. 1996 లో స్వామి రామా సూచనల మేరకే వ్యాపారవేత్త శర్మ మాధవి లు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత మాధవి న్యూజెర్సీలో స్థిరపడింది. తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పాటును అందిస్తోంది.  సినిమాల నుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందంటారు మాధవి. అయితే మళ్ళీ నటించలేదు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!