కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
ఏపీ బీజేపీ పంచాయితీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ని ఓడించి రాబోయే కాలంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న ఆ ఆ పార్టీ నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కరెక్టుగా ఇన్ని పంచాయితీలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు …
News Leaks………………………….. రాజకీయాల్లో, వార్తల ప్రచురణలోనూ అపుడపుడు కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు కొన్ని వార్తలను కావాలనే తమ సన్నిహితుల ద్వారా లీక్ చేయిస్తుంటారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఆ వార్తలు సంచలనంగా మారుతుంటాయి. వాటిపై ఇతర పార్టీలు కూడా స్పందిస్తుంటాయి. ఒక్కోసారి లీక్ ఇప్పించినవారే అదేమీ లేదు అని కూడా ఖండిస్తుంటారు. సహజంగా …
తెలంగాణ లో డాక్టర్ చెరుకు సుధాకర్ పేరు తెలియని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ ఉద్యమ సారథుల్లో ఆయన ప్రముఖుడు. బాల్యం నుంచే సుధాకర్ పోరాటాల బాట పట్టారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ డబ్బుల కోసం ఆయన ఏనాడు పని చేయలేదు. బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉద్యమ బాటలో పయనించారు. బహుజన తెలంగాణా …
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన రోవర్ అంగారక గ్రహంపై సేఫ్ గా ల్యాండ్ అయి తన లక్ష్య సాధనలో దూసుకుపోతోంది. ఆరు చక్రాలున్న రోవర్.. రెండేళ్లు అంగారకుడి పైనే ఉండి పరిశోధనలు చేస్తుంది. అంగారక గ్రహం పై జీవ రాశి ఉందా లేదా అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. అంగారక గ్రహం ఉపరితలాన్ని.. …
MNR ………………………… వైజాగ్ సిటీకి ఎందరో ఐ.ఏ.ఎస్.లు వస్తుంటారు. పోతుంటారు. కానీ చరిత్రలో కొందరే నిలిచిపోతారు. అలాంటి కోవకే చెందిన సిన్సియర్ ఆఫీసర్ సృజనా గుమ్మల్ల ఐ.ఏ.ఎస్. పొత్తిళ్ళలో పసిబిడ్డను పెట్టుకుని కరోనా సమయంలోనూ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగం పట్ల అంకిత భావం.. ముక్కుసూటి తనం… లంచగొండుల …
పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …
ఆమె డబుల్ ఎమ్మే చేసింది. అంత పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం ? విచక్షణ కోల్పోయింది. ప్రేమ మత్తులో పడింది. ప్రియుడితో కలసి ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపేసింది. ఇదొక రకమైన ప్రేమ కథ. ఆవేశంలో చేసిన తప్పుకు ఫలితంగా ఇపుడు జైల్లో కూర్చొని విలపిస్తోంది. త్వరలో ఉరికంబమెక్కబోతోంది. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ గా చరిత్ర కెక్కబోతోంది. ఇక అసలు …
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తప్పించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని సీఎం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి బహిరంగ విమర్శలు …
దుబాయి రాజకుమారి మళ్ళీ వార్తల్లో కెక్కారు. తాను జైలు లాంటి విల్లాలో ఉన్నానని చెబుతూ ఒక వీడియో తీసి తన స్నేహితులకు ఆమె పంపింది. తన జీవితం ఆందోళనకరంగా ఉందని, కనీసం బయటకెళ్ళి గాలి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో బందీగా ఉన్నానని రాకుమారి లతీఫా ఆ వీడియోలో చెప్పుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ …
error: Content is protected !!