అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
తమిళ నాట ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్. ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …
Taadi Prakash ………………………… 1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ చనిపోయినపుడు, మంచి ఫోటో వేసి (అది నా కలెక్షన్) ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెరిపోయిన శ్రీశ్రీ’’ అనే శీర్షికతో వార్త యిచ్చినపుడు, రామోజీ రావు నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పర్సనల్ మెస్సేజ్ పంపారు. ఇది రామోజీ రావు గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అని నేను …
Taadi Prakash ……………… The Genghis Khan of Telugu Journalism ___________________ రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం కొన్నాడు. ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రంపై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక మంగోల్ వీరునిలా! జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. ఎదురుగా వున్న …
పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన …
స్టాక్మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ …
పినరయి విజయన్ సుదీర్ఘ అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
Taadi Prakash ………….. SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పులూ రాలిపోతాయి… చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది…. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే…80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా… కాంతిదారుల్లోనో…కన్నీటి పడవల్లోనో…త్యాగాల చైతన్యదీపాలై వెలిగి.. మానవత్వపు మైదానాల్లో మెలిగి .. …
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లోనారాయణ స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం తో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి అక్కడ 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అన్నిసార్లు రాజకీయ సంక్షోభమే కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. రాబోయే మే నెల వరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. మే …
సాధారణంగా అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయి. లేదంటే ఏదో అంశంపై గొడవ పడటం .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. దేశ వ్యాప్తంగా ఏ అసెంబ్లీ ని చూసినా ఇదే తరహాలో ఉంటుంది. అలాంటిది అనూహ్యంగా రాజస్థాన్ అసెంబ్లీలో దెయ్యాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ చర్చ …
error: Content is protected !!