చరిత్రకారుడిగా కొత్త పాత్రలో డా. దగ్గుబాటి ! (1)

Sharing is Caring...

Abdul Rajahussain ………………………

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. ఈ పేరు తెలుగు ప్రజానీకానికి సుపరిచితం.39 సంవత్సరాల క్రితం ప్రజా జీవితంలోకి ప్రవేశించి,రెండు సంవత్సరాల క్రిందట స్వచ్ఛందంగా ప్రజా జీవితం నుండి వైదొలిగిన వ్యక్తి . ఎన్ని సార్లు పార్టీ మారినా, ఎంతకాలం ప్రజాజీవితంలో ఉన్నా ఎలాంటి విమర్శలకు తావీయని వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా అందరూ అంతో ఇంతో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో సమయాన్ని, సమయపాలన ను సక్రమంగా ఉపయోగించుకుంటూ తన ప్రత్యేకతను నిలుపుకున్న వ్యక్తి. మొదట పాకశాస్త్రంలో నైపుణ్యం సంపాదించు కున్నారు. తదుపరి ప్రపంచ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పుస్తక రచనకు ఉపక్రమించారు.  ఆ విషయాలు ఆయన మాటలలోనే తెలుసుకుందాం.
———————
రాజకీయాల్లోకి రాకముందు ఆయన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పురంధరేశ్వరి గారితో పెళ్ళయ్యాక…….ఎన్టీ రామారావు గారి పెద్దల్లుడు.. రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు యువత అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు,ఎమ్మెల్యే.ఎంపీ, మంత్రి. ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు. ఈ గుర్తింపులన్నీ  పక్కన పెడితే.. ఇప్పుడాయన ఓ  ప్రపంచ చరిత్ర,కారుడు.

పుస్తకాలు చదివేసి ,..ప్రపంచాన్ని చుట్టేసి,.. ప్రపంచ చరిత్ర ..రాస్తున్నారు. గత కొన్నేళ్ళ శోథన…సాధన ఫలితమే డాక్టర్ గారి “ప్రపంచ చరిత్ర…గమనం “.. ఓ చారిత్రాత్మక పరిశోథన గ్రంథం‌ రాయడం దాదాపు.పూర్తయింది. కరోనా ఉధృతి తగ్గాక బయటకు రావచ్చు. డాక్టర్ గారు 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఫ్రెష్..అండ్ క్లీన్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు.అయితే చొరవ కొరవడటం …  రాజకీయ టక్కు టమార విద్యలుతెలీక పోవడం వల్ల రాజకీయాల్లో వెనుక బడ్డారు.

38 సంవత్సరాలుగా రాజకీయాల్లో వున్నారు. 5సార్లు MLA ,లోక్ సభ సభ్యులుగా,రాజ్యసభ సభ్యులుగా వున్నారు.రాష్ట్ర మంత్రిగా చేశారు.మనిషి మెత్తన.. హృదయ వైశాల్యం, నిరాడంబర జీవనం…(అ) రాజకీయ (కు)విద్యల్లో నిశాని కావడం,రాజకీయ ఎదుగుదలకు అవరోధాలయ్యాయి ఇక తెలిసీ,తెలీక చేసిన తప్పిదాలు..కొన్ని పొరబాట్లు ,ఇంకొన్ని ‘ గ్రహ ‘ పాట్లు ఆయన రాజకీయ జీవితానికి స్పీడ్ బ్రేకర్లయ్యాయి.

రాజకీయ కెరీర్లో ‌మధ్య “బ్రేక్ “వచ్చింది. తరచూ రాజకీయపార్టీలు మారడం కూడా ఓ రకంగా ఆయన రాజకీయ వెనుకబాటుకు కారణంగా చెప్పొచ్చు.ఏది ఏమైనా ఏపీ  రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు.ఓ పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దగ్గుబాటి. ఆమధ్య కలంపట్టి కొన్ని రచనలు చేశారు. మూడు పుస్తకాలు కూడా వచ్చాయి. ఇప్పుడేమో “ ప్రపంచ చరిత్ర “ తుది మెరుగుల్లో తలమునకలై వున్నారు.

సో…ఓ రచయితగా డాక్టర్ గారిని  పలకరిద్దాం..మాట్లాడదాం.  డాక్టర్ గారితో దాదాపు 35 యేళ్ళుగా నాకు అనుబంధం వుంది.నేను బాగా ఇష్టపడే వారిలో డాక్టర్ గారు ఒకరు..
ప్ర.*డాక్టర్ గారూ, చాలా కాలమైంది మనం కలిసి, మాట్లాడుకొని,ఎలా వున్నారు? మేడం పురంధేశ్వరి గారు ఎలా వున్నారు?ముఖ్యంగా ఈ ‘ కరోనా కాలంలో యేం చేస్తున్నారు ?
జ*బాగున్నామండీ.ముఖ్యంగా కరోనా వల్ల నా జీవన శైలిలో బాగా మార్పు వచ్చింది.పుస్తకాలు చదవడం..ప్రపంచ చరిత్ర రచనలో లీనం కావడం…దీనికి తోడు ఈ మధ్య కొత్తగా  వంట చేయడం,అంతా ఓ సిస్టమేటిగ్గా జరిగిపోతోంది. వంట చేస్తున్నందు కు పురందేశ్వరి కూడా హ్యాపీ గా వున్నారు.”
*ప్ర * వావ్..! మా డాక్టర్ గారికి రచనలు చేయడం కొత్తేం కాదు గానీ..ఇలా వంట చేయడం మాత్రం విశేషమే…ఏమంటారు..”?
జ*“అవును… లాక్ డౌన్ లో వంటలు చేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెడితే అది పెద్ద వైరల్ అయింది.లక్షలమంది రెస్పాండ్ అయ్యారు.నాకు ఆశ్చర్యమనిపించింది.అంటే  మనకు మగవాళ్ళమన్న ఇగో వదిలేసి ఇలా ఇంట్లో శ్రీమతికి సహకరించడం ఎంత అవసరమో నాకు తెలిసొచ్చింది.ఇక అప్పటి నుండి రోజుకో రెసిపి నా వంతు ఖాతాలో పడుతుంది. శ్రథ్థగా వంటచేస్తున్నాను.చేసిన రెసిపీనే మరుసటి రోజు కాస్త …అటు ..ఇటు చేసివండితే కొత్త రెసిపి తయారవుతోంది. కరోనా ఎన్ని ఇబ్బందులు కలిగిస్తున్నా…లాక్ డౌన్ వల్ల నాకు ఎంతో మేలు జరిగింది.నా జీవన శైలిని పూర్తిగా మార్చుకునే అవకాశం కల్పించింది. థ్యాంక్స్ టు కరోనా లాక్ డౌన్ ”
ప్ర*మీ ఇంట్లో..ముఖ్యంగా మీ రీడింగ్ రూం  లో పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడివుండటం నేను చూశాను.ఇంకా పుస్తకాల సేకరణ  జరుగుతోందా?”
జ* పుస్తకాలు కొనడం,సేకరించడం ఓ నిరంతర ప్రక్రియ.గతంలో పుస్తకాలున్నా..పెద్దగా చదివే వాడిని కాను.గత అయిదేళ్ళుగా పుస్తక పఠనం జీవితంలో ఓ భాగమైపోయింది. ఈ కరోనా లాక్ డౌన్ లో బయటికి పోకుండా బుద్ధిగా ఇంటి పట్టునే వుండి పుస్తకాలన్నిటిని ఓ ఆర్డర్లో పెట్టుకున్నాను.మరీ ముఖ్యంగా ప్రపంచ చరిత్ర కు సంబంధించిన పుస్తకాల్నీ,ప్రపంచాధి నేతల జీవిత చరిత్రల్నీ ఓ ఆర్డర్ లో పెట్టుకున్నాను. రాత్రి పెందలకాడ పడుకొని, అర్థరాత్రి రెండు‌ గంటలకు లేచి 6 గంటల వరకు శ్రద్థగా రాసుకుంటాను..ఉదయాన్నే పడుకొని మళ్ళీ మధ్యాహ్నం ఒంటిగంటకు నిద్ర లేచి భోజనం .. ఆతర్వాత మళ్ళీ చదువుకోవడం…ఇంట్లో వంటలో సహకరించడం….ఇదీ నా లాక్ డౌన్ టైమ్ టేబుల్..ఇక ముందు కూడా ఇదే కంటిన్యూ కావచ్చేమో..?

ప్ర*గుడ్..ఇప్పుడు మీ రచల పర్వం గురించి చెప్పండి ?
1.“ రాయడం నాకు కొత్త విద్యే…గతంలో తెలుగు దేశం పార్టీ..రాజకీయాల గురించి “ ఒక చరిత్ర .. కొన్ని నిజాలు “ పేరుతో ఓ పుస్తకం రాశాను. చాలా నిజాయితీతో, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్టు రాశాను. 2.రెండో పుస్తకం…” తెలుగు వారి చరిత్ర… శాతవాహనులు “.రాశాను.అది జనామోదం పొందింది. 3.రాష్ట్ర ఏర్పాటు వాదం..తెలుగు రాష్ట్రాల విభజనల మీద మూడో పుస్తకం వచ్చింది. ఇది కూడా జనాదరణ పొందింది. 4..ఇప్పుడు..” ప్రపంచ చరిత్ర…గమనం “ గురించి ఓ బృహత్ పుస్తకాన్ని రచిస్తున్నాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. కరోనా లాక్ డౌన్ వల్ల రాసేశాను.చిన్న చిన్న మార్పులు,చేర్పులవుతున్నాయి.కరోనా తగ్గేక పుస్తకావిష్కరణ జరగొచ్చు.

Read it also …………………… చరిత్రకారుడిగా కొత్త పాత్రలో డా. దగ్గుబాటి ! (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!