సీమ సాంస్కృతిక వైభవానికి ప్రతీక ఈ ‘లేపాక్షి’ !

Sharing is Caring...

Book on Lepakshi………………………..

లేపాక్షి అనగానే ఎవరికైనా రామాయణ గాధ గుర్తుకు వస్తుంది. ఆ పేరు మీద సీనియర్ జర్నలిస్ట్ మైనా స్వామి (మైలారం నారాయణ స్వామి) ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. “విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవం” గురించి విస్తృతంగా ఈ పుస్తకం లో మైనాస్వామి వివరించారు.

విజయనగర సామ్రాజ్య సంస్కృతి గొప్పతనం, విశేషాలు, ప్రత్యేకతలను పరిశీలించి పుస్తకంలో పొందుపరిచారు.  మైనాస్వామి చరిత్ర పరిశోధకుడిగా రాయలసీమ అంటే రాళ్ళ సీమ, బాంబుల సీమ , హత్యల సీమ కాదు. రాయలసీమ అంటే తెలుగు జాతి వైభవానికి , హైందవ సాంప్రదాయానికి, చారిత్రక ఆలయాలకు నిలయం అని తెలియ జెప్పేందుకు  చాలా తపన పడ్డారు.

ఇరవై ఏళ్ళక్రితమే రాయలసీమ చరిత్ర-సంస్కృతి-కరువు-నీటి వనరులు-ముఠాకక్షలు తదితర అంశాలపై “ఎన్నాళ్ళీ కన్నీళ్ళు? ” పుస్తకం కూడా తీసుకొచ్చారు.తెలుగు నేల చరిత్రలో ముందు వరుసలో ఉండేవి కాకతీయ సామ్రాజ్య చరిత్ర -విజయ నగర సామ్రాజ్య చరిత్ర.ఇక రాయలసీమను సస్యశ్యామలం చేసిన చరిత్ర  అయితే మాత్రం విజయనగర సామ్రాజ్య చరిత్రనే.

విజయనగర చరిత్రను కృష్ణ దేవరాయలకు ముందు..రాయలు హయాం … రాయలకు తరువాత గా విభజించవచ్చు. కృష్ణ దేవరాయల తరువాత పాలించిన అచ్యుతారాయల వారి పాలనా కాలంలో విరూపన్న ఆధ్వర్యంలో తీర్చిదిద్దబడి ఈ రోజున  తెలుగు వైభవానికి సజీవ సాక్ష్యం గా నిలిచింది లేపాక్షి. ఈ లేపాక్షిలో వీరభద్ర ఆలయం, పాపనాశేశ్వరం, పార్వతీ మాత ఆలయం, రఘునాథ స్వామి ఆలయం, భద్రకాళి ఆలయం వీటి అన్నిటినీ కలుపుతూ మహా మండపం , నాట్య మండపం ఉంటాయి.

మన పూర్వీకుల ఎంతో తెలివైన వాళ్ళు. చారిత్రక ఆలయాల సాక్ష్యాలుగా ఆలయాల రాతి గోడల పై అలనాటి పాలనా విశేషాలు,ఇతర వివరాలు భావితరాలకు తెలిసేలా చెక్కించారు. నాడు అలా చేయబట్టే ఎందరో రాజుల దాడుల తరువాత కూడా ఆలయాలు సజీవం గా దర్శనమిస్తున్నాయి.

ఇక కొన్ని తైలవర్ణ చిత్రాలు అద్భుతమని చెప్పుకోవచ్చు.మహాశివుడు భిక్షాటన మూర్తిగా దర్శనం ఇచ్చే ఆలయం లేపాక్షి ని తప్పక చూడాలి. ఈలేపాక్షి గురించి తెలుసుకోవాలంటే  పుస్తకం చదవాల్సిందే.
ఈ కింద పేర్కొన్న చోట్ల “లేపాక్షి” లభ్యమవుతుంది.
నవోదయపుస్తక కేంద్రo : 90004 13413…విశాలాంధ్ర బుక్ హౌస్ 9948950282 …. పల్లవి పుస్తక కేంద్రo : 9866115655
అక్షర పుస్తక కేంద్రo : 040-23554096….

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!