మొదటి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు !!

Sharing is Caring...

A young director who has shown his talent….

మార్టిన్ జోసెఫ్ తారకున్నెల్ (Martin Joseph Tharakunnel) మలయాళ చిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్న ఒక యువ దర్శకుడు. తన తొలి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘దృఢం’ తో  దర్శకుడిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.దృఢం ఓటీటీ లోకి వచ్చిన దరిమిలా దేశవ్యాప్తంగా ఎవరీ మార్టిన్ జోసెఫ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు

మార్టిన్ జోసెఫ్ మలయాళ లెజెండరీ థ్రిల్లర్ దర్శకుడు జీతూ జోసెఫ్ (దృశ్యం ఫేమ్) వద్ద చీఫ్ అసోసియేట్, అసిస్టెంట్ దర్శకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన జీతూ జోసెఫ్ పర్యవేక్షణలో వచ్చిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లు దృశ్యం 2, 12th  మ్యాన్ , కూమన్ , నేరు, నునక్కుళి (Nunakkuzhi) వంటి  చిత్రాలకు సహాయ దర్శకుడిగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే లోని మెళకువలను నేర్చుకున్నారు.అంతేకాదు, దృశ్యం 2 (2021) చిత్రంలో ఒక చిన్న పాత్రలో కూడా ఆయన నటించారు.

తన గురువు జీతూ జోసెఫ్ సమర్పణలోనే  మార్టిన్ జోసెఫ్ తన మొదటి చిత్రం ‘దృఢం’ ను తెరకెక్కించే అవకాశం అందుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్టిన్ మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు చాలా తెలివైన వారు..  స్క్రీన్‌ప్లే రాసేటప్పుడు ప్రేక్షకుడి ఆలోచనల కంటే దర్శకుడు ఒక అడుగు ముందుండడమే ఇవాల్టి అతిపెద్ద సవాలు” అని చెప్పుకొచ్చారు.

ఆ సవాలును స్వీకరించి, సినిమాలో లేడీ కానిస్టేబుల్ (సానియా ఫాతిమా) పాత్రను హిడెన్ సైకో విలన్‌గా మలిచి ప్రేక్షకులు ఊహించని మైండ్-బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్‌ను సృష్టించారు.మార్టిన్ జోసెఫ్ తన తొలి చిత్రంలోనే గురువుకు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు ఒక ప్రత్యేకమైన ట్రిబ్యూట్ ఇచ్చారు. 

‘దృఢం’ క్లైమాక్స్ సన్నివేశంలో హీరో షేన్ నిగమ్ చేత “ఆ రహస్యం ఈ భూమిపై రెండో వ్యక్తికి తెలియదు.. అది నాతోనే మట్టిలో కలిసిపోతుంది” అనే డైలాగ్ చెప్పించారు. ఇది దృశ్యం మొదటి భాగంలో మోహన్‌లాల్ చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ, థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

పరిమిత బడ్జెట్ తో  కేరళ అడవుల సహజ వాతావరణాన్ని వాడుకుంటూ, రా అండ్ రస్టిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామాను నడిపించడంలో మార్టిన్ జోసెఫ్ సఫలమయ్యారు. గురువు జీతూ జోసెఫ్ లాగే మలయాళ చిత్రసీమలో ఒక పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ డైరెక్టర్‌గా ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని విమర్శకులు ప్రశంసించారు. 

మలయాళంలో థ్రిల్లర్ సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా సాధారణం (ఉదాహరణకు: దృశ్యం). కాబట్టి మార్టిన్ జోసెఫ్ తన గురువు జీతూ జోసెఫ్ పర్యవేక్షణలోనే ‘దృఢం పార్ట్-2’ స్క్రిప్ట్‌పై త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.  

మార్టిన్ జోసెఫ్ మేకింగ్ స్టైల్ నచ్చడంతో, ఆయన గురువు జీతూ జోసెఫ్ తన సొంత బ్యానర్ ‘బెడ్‌టైమ్ స్టోరీస్’  లో మార్టిన్‌కు మరో సినిమా చేసే అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక పక్కా మైండ్-గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతోనే ఉండబోతుందట.

మార్టిన్ జోసెఫ్ ‘ తన తదుపరి సినిమాను ఏ స్టార్ హీరోతో చేయబోతున్నారు అనే అధికారిక వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. దర్శకుడు మార్టిన్ జోసెఫ్ కేరళలో జన్మించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో నేరుగా మాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

చాలా మందిలా ఆయన ఎలాంటి ప్రత్యేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్సులు చేయలేదు; నేరుగా సెట్స్‌లోనే ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించారు. దాదాపు  ఆరేళ్ల పాటు ఆయన జీతూ జోసెఫ్ స్కూల్‌లోనే ఉంటూ స్క్రీన్‌ప్లే, మేకింగ్ మెళకువలు నేర్చుకున్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!