ఆ విగ్రహం రంగు మారిపోతుంటుందా ?

Sharing is Caring...

A rare temple………………………

మనదేశంలో ఎన్నో ప్రత్యేకతలున్న విశిష్ట దేవాలయాలున్నాయి. మధ్య ప్రదేశ్ లో రంగులు మారే లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో పరిష్కారాలు దొరుకుతాయని చెబుతారు.ఆ విశిష్ట లక్ష్మీదేవి దేవాలయం గురించి తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న పచ్చమాత ఆలయం అనేక రహస్యాలను తనలో దాచుకుంది. ఈ ఆలయ చరిత్ర సుమారు 1100 సంవత్సరాల నాటిది.. గోండ్వానా పాలనలోని రాణి దుర్గావతకు సంబంధించినదని చెబుతారు. క్వీన్స్ దివాన్ ఆధార్ సింగ్ పేరు మీద ఉన్న అధర్తల్ చెరువులో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతిష్టించిన లక్ష్మీ దేవి విగ్రహం మూడుసార్లు రంగు మారుతుంది. ఈ కారణంగా ఇది విశిష్ట దేవాలయాల జాబితాలో చేర్చబడింది. విగ్రహం రంగు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపు, సాయంత్రం నీలంగా మారుతుందని నమ్మకం. అంతే కాదు ఆలయంలోని అమ్మవారి పాదాలపై సూర్యకిరణాలు పడతాయి. సూర్య భగవానుడు లక్ష్మీదేవికి ఈ విధంగా నమస్కరిస్తున్నాడని ప్రజల నమ్మకం.

రంగుల మారే విగ్రహాన్ని దర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కారణంగానే ఈ ఆలయంలో శుక్రవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 7 శుక్రవారాలు దర్శనం చేసుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

కొన్నిసార్లు, లోహంతో లేదా ఇతర పదార్థాలతో చేసిన విగ్రహాలు పరిసరాల్లోని తేమ, ఉష్ణోగ్రత లేదా కొన్ని రసాయనాల ప్రభావంతో రంగు మారవచ్చు. 2002లో కోల్‌కతాలో ఒక లక్ష్మీ విగ్రహం రంగు ఆకుపచ్చగా, ఆ తర్వాత నీలం రంగులోకి మారిందని, ఇది రసాయన ప్రతిచర్యల వల్ల జరిగి ఉండవచ్చని నిపుణులు భావించారు.అదే తీరున ఇక్కడ విగ్రహం రంగులు మారుతుండవచ్చని వాద కూడా ప్రచారం లో ఉంది

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!