Mount Kailash…………………………………….
కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది.
1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి కైలాస పర్వతం పిరమిడ్ ఆకారంలో మానవులు నిర్మించిన అత్యద్భుతమైన భారీ కట్టడమని చెప్పారు. కేవలం కైలాస పర్వతం మాత్రమే కాదని, దాని చుట్టూ వందకు పైగా పిరమిడ్ ఆకృతులు కూడా ఉన్నాయని, వాటిని కూడా మానవులే నిర్మించారని ముల్దేశేవా అభిప్రాయ పడ్డారు.
అయితే ఈ పిరమిడ్లను మన కన్నా ఎంతో అడ్వాన్స్ గా ఉన్నవాళ్లు నిర్మించి ఉంటారని అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. కైలాస పర్వతం పరిపూర్ణ ఆకృతి ప్రపంచంలోని ఇతర శిఖరాల కంటే భిన్నంగా ఉంటుంది. ఏ కోణంలో చూసినా ఇది సహజ పర్వతంలా కనిపించదు. కైలాస పర్వతం అన్ని పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రమని కూడా ఆ టీమ్ అప్పట్లో చెప్పుకొచ్చింది.
కైలాస పర్వతాన్నికేంద్రంగా చేసుకొని చుట్టూ ఓ పద్ధతి ప్రకారం వందకు పైగా పిరమిడ్లను నిర్మించారని టీమ్ వివరించింది. అయితే ఈఆర్.ముల్దేశేవా టీమ్ వాదనను చైనా శాస్త్రవేత్తలు, భారతీయ ఆధ్యాత్మికవేత్తలు ఖండించారు.ఈఆర్.ముల్దేశేవా వాదనతో ఏకీభవించడం లేదని ప్రకటించారు.
ఇది సహజంగా ఏర్పడిన పర్వతమని చైనా శాస్త్రవేత్తలు వాదించారు. అది దేవుని లీల అని భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇది ప్రత్యేకమైన పిరమిడ్ ఆకారంలో ఉన్న సహజ పర్వతం. దీని మూలం గురించి రకరకాల ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. దీనిని మానవులు నిర్మించారనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
దాని పరిపూర్ణ పిరమిడ్ ఆకారం,ఇతర భౌగోళిక లక్షణాలు, దాని సృష్టి గురించి చర్చ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కైలాస పర్వతం సహజంగా ఏర్పడిన పర్వతం అనేది ప్రబలంగా ఉన్న శాస్త్రీయ అభిప్రాయం. కొంతమంది పరిశోధకులు దాని సమరూపత కారణంగా ఇది పురాతనమైన, మానవ నిర్మిత పిరమిడ్ కావచ్చునని వాదించారు. కైలాస పర్వతాన్ని మానవులు నిర్మించారని సూచించడానికి ఎటువంటి పురావస్తు లేదా చారిత్రక ఆధారాలు లేవు.
కైలాస్ పర్వతం ప్రపంచానికి విశ్వకేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆధ్యాత్మిక కార్యకలాపాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంది. కొంతమంది కైలాస పర్వతం స్వర్గాన్ని భూమిని కలిపే శిఖరం అని .. పైన ఉన్న పిరమిడ్ వాస్తవానికి రెండింటినీ కలిపే స్తంభం అని కూడా నమ్ముతారు.
కైలాస పర్వతం చుట్టూ అసాధారణ విద్యుదయస్కాంత కార్యకలాపాలను నాసా గుర్తించింది, దీని వలన దిక్సూచి పనిచేయకపోవచ్చు,ఎలక్ట్రానిక్ పరికరాలు అస్థిరంగా ప్రవర్తించవచ్చు. వీటికి ఖచ్చితమైన కారణం పర్వతం భౌగోళిక కూర్పు అని శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు.కైలాస పర్వతాన్నిఅధ్యయనం చేయడానికి నాసా ఉపగ్రహ చిత్రాలను సేకరించి, దాని భౌగోళిక నిర్మాణం గురించి అధ్యయనం చేస్తోంది.