ఆ రెండు రాష్ట్రాల్లో ఫిరాయింపులు తప్పవా ?

Sharing is Caring...

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల మాత్రమే తన సత్తా చాటుకుని విపక్షాలను చావు దెబ్బతీసింది. ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఉత్తరాఖండ్ విషయానికొస్తే … అక్కడి ఓట్లర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మ్యాజిక్ మార్క్ 36 సీట్లు మాత్రమే. ఆమార్క్ ను బీజేపీ దాటింది కాబట్టి పార్టీ ఉత్తరాఖండ్ లో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పుకోవచ్చు.

కాంగ్రెస్ ఇక్కడ  22 సీట్లలో మాత్రమే ఆధిక్యత కనపరిచింది. బీజేపీ 33-39 సీట్లు కైవసం చేసుకోవచ్చని సర్వేలు  చెప్పాయి. అయితే అంత కంటే ఎక్కువే గెలిచింది.కాంగ్రెస్ 29-35 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు. కానీ బాగా వెనుకబడింది.

మణిపూర్ లో కూడా బీజేపీ 28 చోట్ల ఆధిక్యతతో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 21 సీట్లలోనే గెలిచింది. ఈ సారి బలం పెరిగింది. కాంగ్రెస్ 9 చోట్ల, నేషనల్ పీపుల్స్ పార్టీ 9 చోట్ల మాత్రమే ఆధిక్యతలో ఉన్నాయి. మొత్తం 60 సీట్లున్న మణిపూర్ లో సింగల్ లార్జెస్ట్ పార్టీ గా బీజేపీ అవతరించింది. ఇతర పార్టీల సహకారం తో అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సర్వే లు కూడా ఇవే చెప్పాయి. జె డి యు, నేషనల్ పీపుల్స్ పార్టీల సహకారంతో బీజేపీ కి అధికారం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. 

అంటే ఫిరాయింపులు తప్పవనే చెప్పుకోవాలి. ఇక గోవాలో బీజేపీ 20 చోట్ల గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. గతంలో 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి  ఏడు  సీట్లు అదనంగా గెలుచుకుంది. మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ గతంలో 20 చోట్ల గెలిచింది. ఈసారి ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయింది.

బీజేపీ అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 21 కాగా ఒక సీటు మాత్రమే తక్కువ.ఇతర పార్టీలు సహకరించక పోతే సింగల్ లార్జెస్ట్ పార్టీ గా గవర్నర్ బీజేపీ ని ప్రభుత్వ ఏర్పాటుకి పిలిచే అవకాశాలున్నాయి. ఇక్కడ ఆప్ 2చోట్ల గెలవగా, మిగిలిన సీట్లను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ కూడ ఫిరాయింపులు తప్పనిసరి అని చెప్పుకోవాలి. గతంలో కూడా ఫిరాయింపులతో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇపుడు ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!