పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …
March 15, 2021
విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి …
March 14, 2021
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నందిగ్రామ్ లో తోపులాట సందర్భంగా దీదీ కాలుకి గాయమైంది.తర్వాత ఆమె కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు మరో రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినప్పటికీ ఆమె డిశ్చార్జ్ అయి …
March 14, 2021
ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒడిశా అసెంబ్లీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాణి గ్రాహి శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో తోటి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలోఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పాణిగ్రాహి ఆరోపించారు. రాష్ట్రంలో …
March 13, 2021
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో …
March 12, 2021
గంగూ భాయి కథ కల్పితం కాదు.. నిజ జీవిత కథే. దాదాపు అరవై ఏళ్ళక్రితం జరిగిందే. 1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ భాయి ఓ వెలుగు వెలిగింది. కామాటిపురా లో ఆమె మకుటం లేని మహారాణిగా చక్రం తిప్పింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూ …
March 12, 2021
రమణ కొంటికర్ల ………………………………………… జెండాపై కపిరాజు..ముందు సితవాజి శ్రేణియుంగూర్చి..నే దండంబుగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి.. ఫల్గునుడు మూకను జెండుచున్నప్పు డొక్కండున్ నీ మొర నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు దుర్యోధనుడితో చెబుతున్న నాటి ద్వాపరయుగపు సన్నివేశాలు ఓసారి మదిలో కదలాడినా…అరయవైతివి మనసుగలట్టి కూర్మీ కాల్చవైతివి శ్రీరాము ఘనతనైన …
March 10, 2021
విశాఖ ఉక్కు విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అఖిలపక్షంతో కలసి వస్తామని … తమ ఆందోళనను నేరుగా వివరిస్తామని ప్రధాని మోడీకి లేఖ రాయడం మంచి పరిణామమే. అయితే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో ఓ మెట్టు దిగివస్తారా ? లేదా ? అనేది సస్పెన్స్.ఏపీ బీజేపీ నేతలు …
March 10, 2021
పై ఫొటోలో కనబడే గ్రామం మధ్యప్రదేశ్లోని మాండ్ల జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ గ్రామం పేరు మలపాథర్. ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ వివాద రహితంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తుల మధ్య వివాదాలు ఏర్పడినా సమీపం లో ఉన్న పోలీస్స్టేషన్ కు వెళ్ళరు.కేసులు పెట్టుకోరు. గ్రామస్తులే కూర్చుని …
March 10, 2021
error: Content is protected !!