ఇగో vs ఇగో – ఇగో = ??

Sharing is Caring...

విడాకులు అనేవి ప్రస్తుత కాలంలో కామన్ గా మారిపోయాయి. చిన్న విషయాలలోనే ఇగో దెబ్బతిని విడిపోతున్నారు. ఇద్దరికీ ఆర్ధిక స్వేచ్ఛ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నటీనటులు చాలామంది వైవాహిక బంధాలు తెంచేసుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించేస్తున్నారు. 

ఆమధ్య చైతూ,సమంతలు తాజాగా ధనుష్ ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారు. సామాన్య జనంలో కూడా ఈ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే వీరు చెప్పుకోరు. సెలెబ్రిటీస్ చెప్పుకుంటారు. దాంతో ఫోకస్ అంతా సెలెబ్రిటీస్ మీదనే పడుతుంది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల అంశం వారి అభిమానులను షాక్ కి గురి చేసింది.

వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట ఎందుకు సడన్ గా విడిపోయారు అనేది ఎవరికి తెలీదు. రక రకాల ప్రచారాలు మాత్రం జరుగుతున్నాయి. వీటిలో నిజమెంత ? అబద్ధమెంత ? అనేది ఆ ఇద్దరికే తెలియాలి. ధనుష్ మొదటినుంచి వర్క్‌ హోలిక్. అన్నింటికంటే పనికే ప్రాధాన్యతనిస్తారు. సినిమా షూటింగ్స్.. చర్చలు.. ప్రయాణాలతో ఎపుడూ బిజీగా ఉంటాడు.  ఈ బిజీనే అతని కుటుంబ జీవితాన్ని దెబ్బతీసింది అంటారు.

కొన్నాళ్ల క్రితం సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచే ధనుష్‌-ఐశ్వర్యల మధ్య గొడవలు మొదలైనట్టు తమిళ పత్రికలు రాస్తున్నాయి. అప్పట్లో రజనీ జోక్యంతో ఇద్దరూ కలసిపోయారని అంటారు. ఈ సారి మటుకు ధనుష్‌ కారణంగానే విడాకుల సమస్య తలెత్తిందని కోలీవుడ్‌ పత్రికల కథనం. ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉంటున్న కారణంగానే ఐశ్వర్య దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం. 

రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ నిర్మించిన ‘కాలా’సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్ధికంగా ధనుష్ నష్టపోయాడు. మామ గారు ఎలాంటి సహాయం చేయలేదని ధనుష్ అసంతృప్తితో ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నారు.  ధనుష్‌తో ఐశ్వర్య ఓ పాన్‌ ఇండియా సినిమా తీస్తానని చెప్పగా .. అతను ఒప్పుకోలేదని కూడా అంటారు. చిన్న చిన్న అపార్ధాలు, అపోహలు, వీటికి తోడు ఇగో కారణంగానే వీరిద్దరు దూరమైనారని అంటున్నారు.

విడాకుల నిర్ణయాన్ని రజనీకాంత్‌ వారిద్దరకే వదిలేసారని చెబుతున్నారు. ధనుష్‌, ఐశ్వర్యల వివాహం 2004, నవంబరు 18న జరిగింది. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్ కి తమిళంలోనే కాదు పలు భాషల్లో ఫాలోయర్స్ ఉన్నారు. సొంతంగా స్టార్ హోదా ను సాధించుకున్ననటుడు అని చెప్పుకోవాలి.

అదలావుంటే రజినీకాంత్ పెద్ద కూతురు సౌందర్య కూడా మొదటి భర్త అశ్విన్ రామ్ కుమార్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటికే వారికి వేదకృష్ణ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. 2019 ఫిబ్రవరి లో సౌందర్య విషగన్ అనే నటుడిని మళ్ళీ పెళ్లి చేసుకుంది. అతగాడు కూడా అంతకుముందే భార్యకు విడాకులు ఇచ్చాడు.ఇక రజనీ కాంత్ విషయానికొస్తే ఆయన వివాహ జీవితం సాఫీ గానే సాగుతోంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!