పోర్టులు అందుబాటులో కొస్తే.. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా ?

Sharing is Caring...

Gopal L………………… 

Progress is possible if positivity is converted into attitude………..

ఆంధ్రప్రదేశ్ 974 km తో గుజరాత్ తరువాత రెండో పొడవైన సముద్ర తీరమున్న రాష్ట్రం అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2022 -23 నాటికి  పోర్టుల సామర్థ్యం 1352 మిలియన్ టన్నుల మొత్తముతో  10 .4 % వాటాతో తో ఐదవ స్థానములో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత మొదటి 5 ఏళ్లలో సన్ రైజ్ స్టేట్, పొడవైన సముద్ర తీరప్రాంతమున్న రాష్ట్రమని గొప్పగా ప్రచారమైతే హోరెత్తించారు కానీ కానీ అంతటి అద్భుత సానుకూలతను నిజంగా ఏమైనా వాడుకున్నారా అంటే సున్నా అని చెప్పొచ్చు.

ప్రస్తుత YCP ప్రభుతం వచ్చాక 4 నూతన పోర్టుల పనులు మొదలు పెట్టడం తో పాటు ఇప్పుడు రామాయపట్నం పోర్టు మొదటి దశ ప్రారంభానికి సిద్ధమైంది , దీనితో పాటు 10 ఫిషింగ్ హార్బర్ లను అభివృద్ధి చేస్తోంది తొందర్లోనే అవికూడా క్రమంగా అందుబాటులోకి వచ్చి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయ పురోభివృద్ధిని సాధించే దిశగా గట్టి అడుగులు పడుతున్నట్లే.

మొత్తం ప్రపంచ వాణిజ్యం 32 ట్రిలియన్ USD ( 26,51,52,000 కోట్ల రూపాయలు) లలో సర్వీస్ సెక్టార్ వాటా 25 శాతమైతే మిగిలిన 75 శాతం తయారీ , మినరల్ అండ్ ఆయిల్స్ ఇతర రంగాలది. మన సర్వీస్ రంగం ఎక్సపోర్ట్స్ ( 26 .51 లక్షల కోట్లు ) ప్రపంచ సర్వీస్ రంగములో 4 % , మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 1 శాతానికి పరిమితం. మన తయారీ ఇతర రంగాల వాటా ( 37 .51 లక్షల కోట్లు )ప్రపంచ తయారీ రంగ వాణిజ్యంలో 2 శాతం , మొత్తం వాణిజ్యంలో 1 .5 శాతం మాత్రమే. ఇక మన IT …   BPO ఎక్సపోర్ట్స్ 16 లక్షల కోట్లకు పరిమితం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమికంగా మంచి తీరప్రాంతము తో కూడిన వ్యవసాయ రాష్ట్రం, ప్రపంచ వాణిజ్యం లో వ్యవసాయరంగం వాటా 10 %, వ్యవసాయ వాటాలో మన దేశ వాటా కేవలం 2 శాతం. అందులో తిరిగి పండ్లు, పూల ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా దాదాపు 55 శాతం.

మనము IT లో ఎంతో సాధించిందనుకుంటున్న హైదరాబాద్ IT ఎక్సపోర్ట్స్ విలువ 2 .4 లక్షల కోట్లు. గుజరాత్ 10 వేల కోట్లు కూడా లేదు కానీ వాళ్ళ తయారీ రంగం ఎగుమతులు 12 లక్షల కోట్లకు పైగా ఉండి దేశంలో మహారాష్ట్ర తరువాత రెండో స్థానంలో ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అభివృద్ధి అంతా IT తో సాద్యమని భ్రమపడకుండా దానికంటే ముందు మన రాష్ట్రానికి ఉన్న  సానుకూలతలు ఆలంబనగా అభివృద్ధి సాధించవచ్చని గుజరాత్ ను చూసి నేర్చుకోవచ్చు.

ఏది ప్రచారములో ఉంటే  దాని మాయలో పడి నేల విడిచి సాము చేయటం వాళ్ళను గొప్ప విజనరీలుగా అంతే గొప్పగా ప్రచారం చేయటం, చేసుకోవటం ఆంధ్ర రాష్ట్రనికి దక్కిన ఒక శాపం. సౌత్ కొరియా 1948 లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంటనే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఆటోమొబైల్స్ , ఎలక్ట్రానిక్స్ లలో సాధించిన అద్భుత విజయాలు సాధించారు.

ఆ తర్వాత వాళ్ళ స్థితిగతుల ఆధారంగా విగ్గుల తయారీ ఎగుమతులపై పట్టు సాధించారు. స్టీలు ఉత్పత్తి దాని ద్వారా ఆటోమొబైల్స్ రంగంలోకి ప్రవేశించారు. గొప్ప ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను అభివృద్ధి చేసుకొని ఎలక్ట్రానిక్స్ ఇతర సాంకేతిక రంగాల్లో దూసుకుపోయి శీఘ్రగతిన ప్రగతి సాధించిన దేశంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో పాటు , నూతనంగా వస్తున్న ఒక్కో పోర్టు వద్ద అందుబాటులకి రానున్న 3000 -5000 వేల ఎకరాల పారిశ్రామిక భూములలో తగు పరిశ్రమలు ఏర్పాటు తో పాటు విశాఖలో IT అభివృద్ధికి గట్టి అడుగులు పడితే అన్నిరకాల అభివృద్ధికి దోహద పడుతుంది.
విద్యలో కూడా పై పై పూతగా కాకుండా తగినన్ని నాణ్యమైన, నిజమైన చదువులు నేర్పే ప్రపంచస్థాయి విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవటం భవిష్యత్ భరోసాకు తప్పనిసరి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!