కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

అహం తోనే ఆర్టీసీ సేవలకు బ్రేక్ ?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు.  దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం.  అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో …

ఇక ప్రైవేట్ పట్టాలపై సర్కారీ రైళ్లు !

ఆశ్చర్యంగా ఉంది కదా? అవును కాని ఇది నిజం.  ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏమిటి? అది చేయాల్సిన పని కాదు కదా. కానీ చేస్తున్నది.లాభ నష్టాలతో ముడిపెట్టి ప్రజా రవాణాను కుదించడం, ప్రయాణ అవకాశాలను తగ్గించడం అది కూడా ప్రభుత్వ రంగంలోని రైలు రవాణాలో. భారత్ లాంటి వర్ధమాన దేశంలో ప్రజలకున్న చవక రవాణా సాధనం …

‘దుబ్బాక’ లో దుమ్ము రేపేదెవరో ?

దుబ్బాక  రాజకీయాలు  రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా  గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు.  ఓటర్ల  …

ఎవరీ లార్డ్ మెకాలే ?

బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన …

న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీ కాదా ?

ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన,కార్య నిర్వాహక వ్యవస్థలకు దిక్సూచి గా నిలిచే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండనవసరం లేదా? 70 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రశంశనీయమైన కృషి చేసింది.కానీ ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పద పాత్ర,మరికొన్ని వివాదాలు మినహా మొత్తం మీద న్యాయంగానే వ్యవహరించిదనే భావించవచ్చును. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో,రాజ్యాంగ పరిధికి అతీతంగా చట్ట సభలు …

సమాధులు పిలుస్తున్నాయ్ !

Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …

పాండవుల గుట్టకు మహర్దశ పట్టేనా ?

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లో పర్యాటక స్థలాలు ఎన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాండవుల గుట్ట. జిల్లా  కేంద్రానికి 22 కిమీ దూరంలో  రేగొండ మండలం తిరుమలగిరి సమీపం లోని రావులపల్లి పరిసరాల్లో పాండవుల గుట్ట ఉంది. ఈ కొండల్లోనే కొన్ని గుహలు ఉన్నాయి.    వీటిలో ప్రధాన ఆకర్షణ ఒకటి వుంది.ఇక్కడి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణ చిత్రాలు …

గణిత బ్రహ్మ మన బోధాయనుడు !

మన వేదాలు, శాస్త్రాలను పరిహసించే వారు ముందుగా అందులో దాగివున్న అఖండ విజ్ఞానాన్ని తెలుసుకోవలసి వుంది. ఒక్కో శ్లోకం ఒక్కో విశ్వసూత్రాన్ని విప్పి చెపుతుంది.మన పూర్వీకులు అపార విజ్ఞానాన్ని సూత్రాల రూపంలో,శ్లోకాలుగా గ్రంధస్థం చేసి ఉంచారు. అలాంటి మహానుభావుల్లో బోధాయనుడు (బౌధాయనుడు) గురించి తెలుసుకుందాం. ఆయన తన కాలంలో అనేక సూత్రాలను ప్రతిపాదించాడు. ఆయన సూత్రాలన్నీ కృష్ణ …

“ట్రంప్ మళ్ళీ గెలుస్తాడట” జ్యోతిష్యుల భవిష్యవాణి !

జ్యోతిష్య “శాస్త్రజ్ఞులు ” ట్రంప్ మళ్ళీ గెలుస్తాడని చెబుతున్నారు. భవిష్యవాణి వినిపిస్తున్నారు.కోట్లాది మంది అమెరికన్ల మదిలో ఏముందో వారు తేల్చి పడేసారు!ఈ “శాస్త్రజ్ఞుల”కు భూత,భవిష్యత్, వర్తమానాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి! ఏ ప్రపంచ పరిణామాన్నైనా ఊహించేయగలరు!యుద్ధాలు, విపత్తులు,ప్రకృతి వైపరీత్యాలనుదేశాది నేతల మదిలో ఏ ముందో! వారి తరువాతి అడుగు ఏమిటో ? అది సమాజాన్ని ఎలా …
error: Content is protected !!