కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

“తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం”.. తేల్చేసిన టీటీడీ!

హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయుడి జన్మ స్థలం  తిరుమల గిరుల్లోని అంజనాద్రే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెప్పిన విధంగా ఇవాళ టీటీడీ ప్రకటన చేసింది. పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధన చేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ …

ఆయన లైఫ్ స్టైల్ వేరే ..అందుకే అంత యాక్టీవ్ !

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు  కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …

భిక్షమెత్తుకుంటున్నఅద్భుత కళాకారుడు !

అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి. అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు భిక్షమెత్తుకుంటున్నాడు. మొగిలయ్య ఆఖరి తరం వాయిద్య కారుడు కూడా. ఆయన ప్రతిభను గుర్తించి తెలంగాణ సర్కార్ మొదటి …

“రామోజీ గోబెల్స్ ను మించినోడు”…. ఎన్టీఆర్

తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు  విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …

ఇద్దరూ ఇద్దరే …..తగ్గేదే లేదు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.  మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …

ఎవరీ గ్లోరియా? ‘పద్మశ్రీ’ ఆమెకు ఎలా వచ్చింది ?

రమణ కొంటికర్ల  ………………………………….. సనాతన భారతదేశ సంప్రదాయల మీద భారతీయుల్లో భిన్న విశ్వాసాలుండవచ్చుగాక… ప్రపంచం మొత్తమ్మీద అలాంటి భిన్నాభిప్రాయాలు వినిపించుగాక…! అలాంటి భిన్న విశ్వాసాల సారమే… సమైక్య భారతమని మనం మురిసిపోవచ్చుగాక..! ఆధ్యాత్మిక మూలాలైనటువంటి నాటి వేదాలు, వేదాంత సారాన్ని అమితంగా నమ్మేవారొకవైపు… ఉట్టి చట్టుబండలని కొట్టిపారేసే నాస్తిక లోకమొక వైపు కనిపించవచ్చుగాక. కానీ భారతదేశం …

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని!

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా  కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …

షర్మిల సంకల్పం నెరవేరేనా ?

మహిళలు పార్టీ పెట్టి నడపడం లేదా పార్టీకి వారసులుగా వచ్చి ఆ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభమైన విషయం కాదు. మన దేశంలో ఇందిరా గాంధీ , సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ , జయలలిత వంటి నేతలు అలాంటి సాహస యత్నం చేసి సక్సెస్ అయ్యారు. వీరిలో మమతా బెనర్జీ ఒక్కరే సొంతంగా పార్టీ పెట్టగా మిగిలిన …

పవన్ అదర గొట్టేసాడు !

సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి……………………………..  ఇప్పటికే సూపర్ హిట్ అయిన “మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా” పాటతో ప్రేక్షకుల మనసులో పాజిటివ్ నోట్ నాటుతూ మొదలవుతుంది వకీల్ సాబ్ సినిమా…ఆ పాట తర్వాత, వేముల పల్లవి, జరీనా బేగం, దివ్యా నాయక్ అనే ముగ్గురు ఆడపిల్లలు ఒక అనుకోని సంఘటనలో ఇరుక్కోవడం…… జనాల కోసం …
error: Content is protected !!