పాన్ ఇండియా స్థాయిలో “జగన్”బయోపిక్!

Sharing is Caring...

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా  ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర  బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్  ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం.

వైఎస్ మరణించక ముందు నెలకొన్న పరిస్థితులు .. ఆయన మరణం అనంతర రాజకీయ పరిణామాలు … ఓదార్పు యాత్ర .. జగన్ పార్టీ స్థాపించడం … 2014 ఎన్నికలు … పాదయాత్ర  2019 ఎన్నికలు … సీఎం అవడం వరకు కొన్ని కీలక ఘట్టాలతో కథ తయారు చేసినట్టు తెలుస్తోంది. కొంత కాలం క్రితమే బయో పిక్ గురించి వార్తలు వచ్చేయి.

పూర్తి స్క్రిప్ట్ వినిపించిన దరిమిలా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రతీక్ గాంధీ హిందీ, గుజరాతీ ఇంగ్లిష్ చిత్రాల్లో నటించారు. స్కాం 1992 వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా పరిచయమైనారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడ వచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!