ఇలాంటి మంచి యజమాని దొరకడం అరుదే !!

Sharing is Caring...

A rare owner…………………………….

ఈ రోజుల్లో ఎక్కడా చూసినా … పని చేయించుకుని జీతాలు ఎగ్గొట్టేవారు ఎక్కువ. అలాంటి వ్యక్తులకు భిన్నంగా ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు,బంగారం లాంటి భారీ బహుమతులు ఇచ్చే వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఆయనపేరే సావ్జీ ధోలాకియా.
సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా.. ఆయన   ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 ఫ్లాట్లు పంచిపెట్టారు. మరోసారి 1260 కార్లను బహుమతిగా ఇచ్చారు. ప్రతీ ఏడాది దీపావళి బోనస్‌గా ఉద్యోగులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా ఇస్తుంటారు.

ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఇలా  బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా అంటారు.

అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్‌మెంట్ స్కూల్‌తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం.

ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో చేతిలో ఉన్న పన్నెండు రూపాయల యాభై పైసలు పెట్టి టిక్కెట్ కొని బస్లో సూరత్‌కు వచ్చారు. సూరత్‌లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు.

సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది.

సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని  ఆయన  విరాళంగా ఇచ్చారు.  సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమే కాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు.

మొదట్లో ధోలాకియా  గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా, హెటల్‌లో , వాచ్ అవుట్‌లెట్‌లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట..చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు బాగా తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి మంచి మనసున్న యజమాని దొరకడం నిజంగా ఆ సంస్థ ఉద్యోగుల అదృష్టం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!