ప్రధానిని ప్రశ్నించి వార్తల్లో కెక్కిన మహిళా జర్నలిస్ట్ !!

Sharing is Caring...

Did she do that for publicity?……….

ఫొటోలో కనిపించే మహిళ పేరు హెల్లె లింగ్ స్వెండ్సెన్ (Helle Lyng Svendsen).  నార్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించి వార్తల్లో కెక్కిన నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్. అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల అధినేతలు కేవలం ఉమ్మడి ప్రకటన ఇచ్చేటప్పుడు ప్రశ్నలు అడిగే సెషన్ లేకపోతే నిశ్శబ్దంగా ఉండటం దౌత్యపరమైన నియమం.

కానీ ఆమె నిబంధనలను పక్కనబెట్టి, ప్రధాని మోదీ వెళ్తుండగా గట్టిగా అరుస్తూ (Heckling) ప్రశ్నలు వేయడాన్ని మోదీ మద్దతుదారులు తప్పుబడుతున్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్‌లా కాకుండా కేవలం ప్రచారం కోసం ‘యాక్టివిస్ట్’ లా ప్రవర్తించిందని ట్రోల్ చేస్తున్నారు.

హెల్లె లింగ్ ప్రస్తుతం నార్వే రాజధాని ఓస్లో కేంద్రంగా పనిచేసే ప్రముఖ దినపత్రిక ‘దాగ్‌సావిసెన్’ (Dagsavisen) లో పొలిటికల్ కామెంటేటర్‌గా (రాజకీయ విశ్లేషకురాలిగా) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమె పనిచేసే ‘దాగ్‌సావిసెన్’ పత్రికకు చారిత్రకంగా నార్వేలోని ‘లేబర్ పార్టీ’ (Labour Party) తో సంబంధాలు ఉన్నాయి.ఈ పత్రికలో చేరడానికి ముందు ఆమె నార్వేకు చెందిన పలు ఇతర ప్రాంతీయ వార్తా సంస్థలలో,  ఎంఎస్ఎన్ (MSN) లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు.

తాజా పరిణామాల తర్వాత భారతీయ నెటిజన్లు ఆమె గతంలో రాసిన ఆర్టికల్స్‌ను శోధించి, ఆమె రాజకీయ సిద్ధాంతాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను, అలాగే టెస్లా అధినేత ఎలన్ మస్క్ నిర్ణయాలను విమర్శిస్తూ ఆమె గతంలో ఘాటైన వ్యాసాలు రాశారు.

అదే సమయంలో, చైనాను ఒక “సూపర్ పవర్” (మహాశక్తి) గా అభివర్ణిస్తూ, అక్కడి అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ ఆమె కొన్ని వ్యాసాలు రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటనకు ముందు ఆమెకు ఎక్స్ (ట్విట్టర్) లో కేవలం 800 లోపు ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు.

కానీ మోదీని ప్రశ్నించిన వీడియో వైరల్ అయిన 24 గంటల్లోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 17,000 దాటిపోయింది.ఆమె భారతదేశంలోని రాజకీయ పార్టీలలో కేవలం ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ (INC) ఖాతాను మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండటాన్ని కూడా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఆమెపై సోషల్ మీడియాలో “విదేశీ గూఢచారి/ఏజెంట్” అని ట్రోలింగ్ కావడంతో ఆమె స్వయంగా స్పందిస్తూ.. “నేను ఏ విదేశీ ప్రభుత్వానికి చెందిన ఏజెంట్‌ను కాను. నేను నార్వేలో పనిచేసే ఒక సాధారణ స్వతంత్ర జర్నలిస్ట్‌ను మాత్రమే. ప్రశ్నించడం నా వృత్తి” అని తేల్చిచెప్పారు.

మొత్తంగా, హెల్లె లింగ్ అంతర్జాతీయంగా పెద్దగా గుర్తింపు లేని ఒక నార్వేజియన్ పత్రికా విశ్లేషకురాలైనప్పటికీ, ఈ ఒక్క ఘటనతో ప్రపంచవ్యాప్తంగా రాత్రికి రాత్రే వార్తల్లో నిలిచారు.

 “ప్రధానమంత్రి మోదీ, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ (మీడియా) నుంచి మీరెందుకు ప్రశ్నలు తీసుకోరు?” (Prime Minister Modi, why don’t you take some questions from the freest press in the world?) అనిహెల్లె లింగ్ గట్టిగా అడిగారు.

ఆ తర్వాత ఆమె ఈ వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ—”ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక (Global Press Freedom Index) లో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం 157వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ నేతలను ప్రశ్నించడం డెమోక్రసీలో మా బాధ్యత” అని రాశారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!