Key votes......................
సెటిలర్స్ ఓట్ల పైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా. హైదరాబాద్ లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ సెటిలర్స్ కనిపిస్తారు . హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు.వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. ఏపీ ప్రాంత వాసులు ..ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వీరిలో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత మెజారిటీ కమ్మ సామాజిక వర్గం ఓటర్ల ఆలోచనా తీరు మారిందని పరిశీలకులు చెబుతున్నారు .చంద్రబాబు అరెస్ట్ లో ఏపీ సీఎం జగన్ .. బీజేపీ అగ్ర నేతలు ..కేసీఆర్ కీలక పాత్ర పోషించారని బలంగా నమ్ముతున్నారు. ఆ సామాజిక వర్గంలో ఆ విధమైన ప్రచారం కూడా సాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడం విశేషం.
ఈ నిర్ణయం వెనుక ఈఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లను ఓడించాలన్న యోచన కూడా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ను గెలిపించండి .. గంపగుత్తగా రేవంత్ కి ఓట్లేయండి అంటూ తెరవెనుక ప్రచారం కూడా చేస్తున్నారు. కమ్మసామాజిక వర్గం ఓట్లు దాదాపు మూడున్నర లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు.
వీరిలో కాంగ్రెస్ అంటే గిట్టని వారు ఉండవచ్చు. ప్రస్తుతం తెలంగాణ లో అయిదుగురు కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు చంద్రబాబు ను అభిమానిస్తున్నప్పటికీ వారి సామాజిక వర్గం ఓట్లు తమకే పడాలని కోరుకుంటున్నారు.
ఇక కమ్మ సామాజిక వర్గం కాకుండా మిగిలిన ఓటర్ల లో వివిధ సామాజిక వర్గాల వారున్నారు. వీరిలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్,ఇతర పార్టీలను అభిమానించే వారున్నారు. వీరిలో ఎందరు..ఎలా చంద్రబాబు అరెస్ట్ పట్ల స్పందిస్తున్నారనేది స్పష్టంగా తెలీదు. ఐటీ ఉద్యోగులు విషయంలో కూడా అంతే.
కొంతమంది ఓటు వేయవచ్చు .. మరికొంతమంది ఓటు వేయకపోవచ్చు. నేరుగా టీడీపీ బరిలో ఉంటే ఓటు వేయడం వేరే .. ఆ సామాజిక వర్గం సూచించిన వారికి ఓటేయడం వేరే. మొత్తం మీద విశ్లేషించి చూస్తే గంప గుత్తగా సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కి పడతాయని అంచనావేయలేం. డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

