ఎవరీ మదర్ అఫ్ పిల్ ?

Sharing is Caring...

If she hadn’t tried, wouldn’t the pill have come?………..

ఈ ఫొటోలో కనిపించే ఆమె పేరు  హింగో రాణి … ఆమెనే మదర్ అఫ్ పిల్ అని కూడా పిలుస్తారు. మనం తరచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్‌) గురించి వింటుంటాం. దాన్ని తీసుకువచ్చింది ఈమే. ఈ పిల్‌ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది.   

రెండు అక్షరాల ‘పిల్‌’ అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలికింది. మహిళ న్యాయవాదిగా హింగో రాణి మహోన్నత కృషితో పిల్ బాగా పాపులర్ అయి  ఆమె ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి గా నిలిచింది. 

తన జీవితమంతా న్యాయం కోసం పనిచేశారు. భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని ‘మదర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌(పిఐఎల్‌)’ లేదా ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ తల్లిగా పిలుస్తారు. 
హింగో రాణి 1927 నైరోబీలో జన్మించారు.. కెన్యా, యూకేలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

1947లో భారతదేశానికి  వచ్చారు. వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్‌లోని అండర్‌ ట్రయల్‌ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తాపత్రిక కథనాలను చూసి చలించిపోయారు.  ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయం ఆమె గ్రహించింది.

దీని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు ఎలా చట్టపరమైన ప్రాతినిధ్యం పొంద లేక పోతున్నారనేది ఆమె గమనించారు. ఈ అంతరాన్ని పరిష్కరించేలా బిహార్‌ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్‌ ట్రయల్‌ ఖైదీల తరపున హింగోరాణి తొలిసారిగా ఈ ‘పిల్‌’ని దాఖలు చేశారు.

ఇది హుస్సేనారా ఖాటూన్‌ కేసుగా భారతీయ న్యాయ చరిత్రను  ఓ మలుపు తిప్పింది. ఆ ‘పిల్‌’ కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా మారింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్‌ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా నిలిచి పోయింది. ఈ పిల్‌తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి.

మహిళల హక్కుల కోసం ..  లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం ఆమె వాదించారు. ఆమె ఖైదీల హక్కులు, జైలు పరిస్థితుల్లో మార్పు కోసం కూడా కేసులు వేసి వాదించారు. 

ఆమె బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక పద్ధతులను సవాలు చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం హింగో రాణి కృషి చేశారు.  తమ గోడును చెప్పుకోలేక, న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు.

ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధతగా నిలబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించి ప్రశంసించింది. హింగోరాణి కథ సమాజంలో వచ్చిన శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం ఎలా నిబద్ధతగా వ్యవహరించి పోరాడాలో అనేందుకు కూడా ఆమె ఒక ప్రేరణ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!