MYSTICAL KASHMIR SUMMER SPECIAL TOUR
ఉత్తర భారతంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి.కశ్మీర్ లోయలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి కొండలు, పచ్చికభూములు,హిమాలయ పర్వతాలు, ప్రకృతి రమణీత మనల్నిమరో లోకంలోకి తీసుకెళతాయి.
ఇంకా శ్రీనగర్ అందాలు, మంచుకొండల్లో రోప్వే ప్రయాణం, చుట్టూ ఎతైన కొండలు, పచ్చని పర్వతాల నడుమ ప్రయాణం పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి అందాలను ఆస్వాదించే, అరుదైన అనుభూతులను సొంతం చేసుకునే అవకాశాన్ని IRCTC తీసుకొచ్చింది.
MYSTICAL KASHMIR SUMMER SPECIAL EX HYDERABAD పేరిట తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజి ఆకర్షణీయంగా ఉంది. ఈ టూర్ మొత్తం 5 నైట్స్, 6 డేస్ పాటు సాగుతుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ మొదలవుతుంది. ఈ టూర్లో శ్రీనగర్, గుల్మార్గ్ సహా తదితర ప్రదేశాలను చూసి రావచ్చు. ఈ టూర్ 01.05.2025, 07.05.2025, 21.05.2025, 26.05.2025, 02.06.2025, 12.06.2025 & 16.06.2025 తేదీలలో అందుబాటులో ఉంటుంది.
పర్యటన ఇలా సాగుతుంది…
DAY 1.. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం మొదలవుతుంది. వయా ఛండీగడ్ ద్వారా సాయంత్రానికి శ్రీనగర్ లో దిగుతారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి వెళ్లి చెకిన్ అయ్యాక ఫ్రీ టైమ్ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకుని షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
DAY 2 … బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్మార్గ్కు వెళతారు. అక్కడ మంచుతో కప్పబడిన ఎత్తయిన కొండలు, రోడ్లను చూసి ఎంజాయ్ చేస్తారు.ఈ పర్యటనలో థాజివాస్ గ్లేసియర్ (హిమానీనదం) ప్రధాన ఆకర్షణ..సమీప సందర్శన ప్రదేశాలను చూపిస్తారు. ఆ తర్వాత తిరిగి శ్రీనగర్కు వచ్చి హోటల్లో బస చేస్తారు.
DAY 3.…బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గుల్మార్గ్కు బయల్దేరుతారు. అక్కడ పూలవనాల మధ్య గుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఆకట్టుకుంటుంది.గుల్మార్గ్ గోండోలాకు చేరుతారు. ఇక్కడ రోప్వే ప్రయాణం ప్రధాన ఆకర్షణ .. ఈ ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి ఖర్చులు యాత్రికులే భరించాలి. టిక్కెట్లను ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసాకా తిరిగి శ్రీనగర్ కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడ బస,భోజనం.
DAY 4.... బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ రూమ్ చెక్ అవుట్ చేసి పహల్గామ్కు బయలు దేరతారు. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ అందాలను తిలకిస్తారు. దారిలోకుంకుమ పువ్వు పంటలు కనువిందు చేస్తాయి.అవంతిపూర్ శిథిలాలను చూస్తారు. పహల్గామ్ సినిమా షూటింగ్స్ కు ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం. తర్వాత బీతబ్ వ్యాలీ, చందన్వారీ.. అరు వ్యాలీ సందర్శించవచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్ హోటల్లో చెక్ ఇన్ అవుతారు. అక్కడే రాత్రి బస. భోజనం..
DAY 5...బ్రేక్ ఫాస్ట్ తరువాత శ్రీనగర్కు వెళతారు. అక్కడ ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శిస్తారు. ఆ సాయంత్రం దాల్ సరస్సు వద్ద కు వెళ్లి సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. అలాగే అక్కడున్న చార్-చినార్ (ప్లోటింగ్ గార్డెన్స్) చూస్తారు.ఇక్కడ చార్జీలు యాత్రికులే భరించాలి. తర్వాత హౌస్బోట్లోకి చెకిన్ అయ్యాక ఆ రాత్రికి అక్కడే నిద్ర .అదొక అరుదైన అనుభూతి.
DAY 6 … హౌస్ బోట్ నుంచి చెక్ అవుట్ అయ్యాక మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ కి వెళతారు.. తర్వాత శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి వస్తారు.ఆ సాయంత్రానికి శ్రీనగర్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి… ఫ్లైట్ టికెట్లు.. హోటల్ అకామడేషన్.. బ్రేక్ఫాస్ట్, రాత్రి భోజనం
ట్రావెల్ ఇన్సూరెన్స్.
ప్యాకేజి వివరాలు ఇలా ఉంటాయి ………..
ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA11