కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
సుదర్శన్ టి ……….. అతీతశక్తులవల్ల ఎదో అద్భుతం జరుగుతుందని నమ్మిన వారు నిరక్షరాస్యులు మాత్రమే కారు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.ఇందుకు ఉదాహరణగా మదనపల్లి లో జరిగిన దారుణ ఘటనను చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నతల్లితండ్రులు ఎదిగిన తమ పిల్లలను కర్కశంగా ఎలా చంపారో అర్ధం కాని పరిస్థితి. …
‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. పోటీకి మీరు సిద్ధమా ?” అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు విసిరిన సవాల్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ? అసలు ఈ సవాల్ ఆయన దృష్టికి వెళ్లిందో… లేదో ? కానీ .. పవన్ కళ్యాణ్ స్పందించి సవాల్ కి …
పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? జరపమంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది ? ఉద్యోగులు ముందుకొస్తారా ? అన్ని జవాబు లేని ప్రశ్నలే. సుప్రీం తీర్పు వచ్చేవరకు సస్పెన్సే. ఇవాళ మధ్యాహ్నం కానీ ప్రభుత్వం,ఉద్యోగులు వేసిన పిటీషనలపై విచారణ జరగదు. విచారణ జరిగి కోర్టు తీర్పు బయటకొచ్చేవరకూ ఉత్కంఠ అనివార్యమే.కాగా నామినేషన్ల స్వీకరణకు …
షేర్ల కొనుగోలు కు ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే రిస్కు ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగి లాభాలు స్వీకరిస్తున్నారు. మార్కెట్ చిన్నగా కరెక్షన్ దిశగా పయనిస్తోంది. ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు మార్కెట్లు ఊగిసలాడుతుంటాయి. గత రెండేళ్లలో ఒకసారి ఆర్ధిక మందగమనం … తర్వాత కరోనా మహమ్మారి దెబ్బతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. …
కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ చేసే బెంచ్ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉన్న త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును కేటాయించారు. అయితే తాజాగా పంచాయితీ కేసులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో …
తమిళ రాజకీయాలను అర్ధ శతాబ్దం పాటు శాసించిన డీఎంకే పార్టీ అధినేత ముత్తువేల్ కరుణానిధి తెలుగువాడే. ఇది నిజమే. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో పుట్టారు. ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణా మూర్తి. ఆయన పద్నాలుగేళ్ళ వయసు నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరుణానిధి పుట్టకమునుపే వారి …
ఏపీ లో పంచాయితీ ఎన్నికలు ముందెన్నడూ లేని చిత్రమైన పరిస్థితులను తెర పైకి తెచ్చాయి. ఈ ఎన్నికలే యావత్తు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వైపు .. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కరే ఒకవైపు నిలిచేలా చేశాయి. ఎన్నికలు పెట్టాల్సిందే అని కమీషనర్ .. ఇపుడు కాదు అని ప్రభుత్వం పంతాలకు పోయాయి …
ఏపీ లో పంచాయితీ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసి … తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేమని … కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఎన్నికలు పెట్టి తమ బతుకులను అభద్రతలోకి నెట్టవద్దని ఉద్యోగ …
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. ఎన్నికలు నిర్వహించవచ్చుఅని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని తేల్చి చెప్పన నేపథ్యంలో నిమ్మగడ్డ జోరు పెంచారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే కొందరు అధికారులపై ఆయన వేటు వేసారు. 9 …
error: Content is protected !!