కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

చిన్నమ్మ మళ్ళీ చిటికెలు వేస్తుందా ?

జయలలిత నెచ్చెలి  శశికళ  కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది.  ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి  వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది.  2017 లో శశికళ కర్ణాటక …

మైలారం గుట్టల్లో ఆదిమానవుల ఆనవాళ్లు ! 

Sheik Sadiq Ali …………..  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన  సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు.  ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు. భూమికి 300 అడుగుల …

అయినా.. మనిషి మారలేదు .. కాంక్ష తీరలేదు!!

ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి  కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …

తెర వెనుక సణుగుడు ఇదే !

సినిమా కళాకారులు ముఖ్యమంత్రిని కలిసారు.అబ్బో బ్రహ్మండమైన వార్త.ఇంకేం ప్రజలకు మంచి జరగబోతుంది.వాళ్ళు లోపలకు వెళ్ళి నాలుగు ఫొటోలు తీసుకోని తర్వాత తీరికగా తమ కష్టాలు వెళ్ళబుచ్చుతారు.తమకు తినటానికి కూడా తిండి లేదని,కనుక తమ చేతిలో ఉన్న కనీసం వందకు పైగా ధియేటర్లకు కరెంట్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరతారు.  టికెట్ ధరల పెంపు కోసం అనుమతి అడుగుతారు. 24 …

రణరంగంగా మారిన తైవాన్ పార్లమెంట్ !!

తైవాన్ పార్లమెంట్‌  రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు.  అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య  తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో  కొంత …

దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు … మౌనంగా చూస్తున్న ఓటర్లు !

హైదరాబాద్ ‌జీహెచ్ ఎంసీ  ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ప్రధానంగా   బీజేపీ-ఎంఐఎం పార్టీల నేతల  ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. నేతలు పదునైన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ముందెన్నడూ ఈ రీతిలో ప్రచారం జరగలేదు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ విమర్శలు .. వాగ్గానాల జోరు కూడా …

మౌన వ్యూహంలో మర్మం ఏమిటో ?

‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు.  ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో  టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో కేశవ్ ఒక‌రు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …

చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి  శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. …

ఎవరీ స్టిల్స్ భూషణుడు ?

డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది.   బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో సంపూర్ణ రామాయణం మరింకేదో సినిమాకు ఆయన పనిచేయలేదు. తప్ప …
error: Content is protected !!