అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఫహాద్ ఫాజిల్ నటనా పటిమకు మరో గీటురాయి !

రమణ కొంటికర్ల…………………………………..  బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు. కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ …

రామోజీ కొత్త ప్రయోగం ..12 భాషల్లో ‘బాలభారత్’ చానళ్ళు!

ఈనాడు గ్రూప్ మరో సంచలనానికి తెర లేపింది. ఒకేసారి 12 భాషల్లో బాలభారత్ చానళ్లను ప్రారంభించబోతోంది.  ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి. గ్లోబల్ కంటెంట్ ను స్థానిక భాషల్లో అందిస్తారు. పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే పిల్లలలో సంస్కారం , విలువలు …

‘ఈసీ పై హత్య కేసులు నమోదు చేయాలి’ మద్రాస్ హైకోర్టు ఆగ్రహం !

కేంద్ర ఎన్నికల సంఘం పై కోర్టులు మండి పడుతున్నాయి. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కి ఎన్నికల కమీషనే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి .. విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు  ప్రాసిక్యూట్ చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల …

ఎన్టీవీ చౌదరి ఆకేసులో ఇరుక్కున్నట్టేనా ?

ఎవరైనా తప్పు చేసి దొరికినా లేదా ఆరోపణలు వచ్చినా ఉతికి ఆరేసే టీవీ ఛానల్ గా NTV కి ఓ పేరు ఉంది. అయితే ఆ టీవీ ఛానల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఇపుడు మీడియాకు ఆహారమైనారు. జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీ అక్రమాలపై .. ఆ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర …

ఆతిధ్య రంగంలోకి అంబానీ .. బ్రిటన్ లో పెద్ద టూరిస్ట్ హబ్ !

ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని  విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. …

బతికి ఉండగానే.. మరణించారని ప్రచారం చేసిన మీడియా!

లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. …

మురిపాలలో ముచ్చటైన జంట !

పై ఫొటోలో కనిపించే జంట చూడ ముచ్చటగా ఉంది కదా. కేవలం పొట్టిగా ఉన్నారు తప్పితే మరే లోపం ఆ ఇద్దరికీ లేదు. మొత్తం ప్రపంచంలోనే అతి పొట్టి వాళ్ళు ఈ ఇద్దరూ. బ్రెజిల్ కి చెందిన పాలో గాబ్రియేల్ వయసు 36 ఏళ్ళు. ఎత్తు 90.28 సెంటీమీటర్లు . కత్యుషియా లీషినో వయసు 33 ఏళ్ళు. ఎత్తు 91. 13 సెంటీమీటర్లు. …

ట్విట్టర్ లో రెట్టలు వేస్తున్న నిత్యానందుడు !

జాడ లేకుండా పోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ట్విట్టర్ లో ఖాతా తెరిచి జోకులు పేలుస్తున్నాడు.  కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ దేశమైన కైలాష్ ద్వీపంలోకి భారతీయ భక్తులకు ప్రవేశం లేదని ప్రకటించారు.  భారత్ తో పాటు బ్రెజిల్, ఈ యూ, మలేషియా భక్తుల ప్రవేశం పై నిషేధం విధిస్తున్నట్టు తన ప్రెసిడెన్షియల్ మెండేట్ లో …

ఊడలు దిగి విస్తరిస్తున్న కూటనీతి !

భండారు శ్రీనివాసరావు .……………………………………… పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి …
error: Content is protected !!