Thopudu Bandi Sadiq Ali …………
కాకతీయుల చరిత్ర 3
కాకతీయుల చరిత్ర అనగానే పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు మిత్రులు వ్యక్తిగతంగానూ,ఫోన్లు,మెసెంజర్ ద్వారానూ సాక్ష్యాలు,ఆధారాలూ ,రిఫరెన్సులు ఇస్తున్నారు.నిజానికి కుల నిర్ధారణ లక్ష్యం కాదు. కాకతీయులు దక్షిణాదికి ఎందుకు ఎలా పారిపోయారు?ఎలా తిరిగి వచ్చారు? అనేదే ప్రస్తుతం లక్ష్యం.
అయితే అది అర్ధం కావాలంటే కొంత చారిత్రిక నేపధ్యం తెలియాలనే ఉద్దేశ్యంతో కొన్ని అంశాలను చర్చించాను. కానీ కాకతీయుల కులం గురించి పదేపదే అడుగుతూ ఉండటంతో ఆ అంశానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఇస్తున్నాను.వివిధ సందర్భాల్లో చదివిన పుస్తకాలు,వాటి ఆధారంగా తయారు చేసుకున్న నోట్స్ లోని కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
చరిత్ర పరిశోధనకు పురాణాలు,మత గ్రంధాలు ఎప్పటికీ ప్రామాణికం కావు,కాబోవు అనేది నా బలమైన విశ్వాసం. అయితే ఇతిహాసాలకు కొంత మినహాయింపు ఉంటుంది. ఐతిహాసిక కథలు,కథనాలు కల్పితాలే అయినా, అందులో ప్రస్తావించిన ప్రదేశాలు,ఆనాటి సామాజిక స్థితిగతులు,ఖగోళ,ఆయుర్వేద వైజ్ఞానిక అంశాలను పరిగణన లోకి తీసుకోవాలి.
మానవ సమాజాన్ని కులమతాల ఆధారంగా కాకుండా,జాతుల ప్రాతిపదిక గానే అధ్యయనం చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మనదేశ చరిత్ర అధ్యయనంలో జంబూ ద్వీప నైసర్గిక స్వరూపం, దానికి ఆవల వున్న ప్రాంతాలు,అక్కడి జాతుల ప్రభావం ఏమిటి?అనేవి కూడా కీలక అంశాలు.
ప్రకృతి ఆరాధకులైన ఆదిమ మానవుల జీవన విధానంలోని సూర్యుడు,చంద్రుడు, తద్వారా వారు సాధించిన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం వాటి నుంచి రూపకల్పన చేసిన సూర్య,చంద్ర ఇక్ష్వాక తదితర వంశాలు వీటన్నింటిని పరిణామ క్రమంలోని భాగాలుగానే చూడాలి.
అలాగే,వేదాలు,ఉపనిషత్తులు,యోగవాశిష్టం,భగవద్గీతల్లో చెప్పిన జ్ఞాన యోగం,రాజయోగం,భక్తీ యోగం,కర్మ యోగం లలో కూడా వర్ణ వ్యవస్థ కన్నా,సూక్ష్మంగా గమనిస్తే ‘జాతుల’ (races) లక్షణాలనే పొందు పరిచారు అనేది అర్ధం అవుతుంది. అదే విధంగా వివిధ మతగ్రంధాలలో కథలు,బోధనలు ఎలా ఉన్నా అంతర్లీనంగా, పారాబోలిక్ గా ఆధ్యాత్మిక ‘సాధనే’ మూలంగా,జాతులు,వాటి డీ ఎన్ ఏ, దానికి అనుగుణంగా ఏ పద్ధతులు అనుసరించాలి అనేవే ప్రధాన అంశాలుగా ఉంటాయి.
కాకతీయుల గురించి రాస్తున్నప్పుడు స్థూలంగా వారిని ఒక జాతి అనే దృష్టితోనే చూడటం జరిగింది. ఈ జాతి స్వచ్చమైన జలం లాంటిది.పాలల్లో పాలలా,నీళ్ళల్లో నీళ్ళలా కలిసిపోతుంది.ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించు కుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పేర్లతో విస్తరించి ఉన్నయాదవుల మొదలుకొని ,కమ్మ,రెడ్డి ,అగ్నికుల క్షత్రియ, వెలమ, క్రమంగా అంతరించి పోతున్న ఎరుకల కులం వరకూ అందరిలోనూ ఈ జాతికి సంబంధించిన కొన్ని ప్రత్యెక లక్షణాలు కన్పిస్తాయి. వీటి మీద చర్చ మొదలు పెడితే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. కాబట్టి కాకతీయుల కులం జోలికి చర్చను తీసుకొని వెళ్ళ లేదు.
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>> కాకతీయులు శివారాధకులా ?