Seven Mothers …………………..
ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల గోడపై శిలా చిత్రాలుగా గాని 7 గురు దేవతా మూర్తుల రూపాలు దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే ‘సప్త మాతృకలు’ అంటారు.
సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, అయన చాలన శక్తి ఆ పరమేశ్వరి . పురుష రూపంలో ఆమె బ్రహ్మ , విష్ణు , మహేశ్వర , ఇంద్రాది రూపాలను పొందితే, వారి శక్తి స్వరూపమైన దేవి సప్తమాతృకలుగా ఆవిర్భవించింది . నిజానికి సర్వదేవతలూ ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.
హిందూ సంప్రదాయంలో ఈ ఏడుగురు మాతృమూర్తులను దేవతలుగా పూజిస్తారు.వీరు బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, వైరాణి, ఇంద్రాణి, చాముండ. వీరు ఒక్కొక్కరు ఒక్కో దేవుడి శక్తి రూపాలుగా భక్తులు నమ్ముతారు.
సప్తమాతృకలు:
- బ్రహ్మణి:
బ్రహ్మ దేవుని భార్య. సృష్టికి సంబంధించిన శక్తి. - వైష్ణవి:
విష్ణుమూర్తి భార్య. పాలనకు, రక్షణకు సంబంధించిన శక్తి. - మహేశ్వరి:
శివమూర్తి భార్య. సంహారానికి, పరివర్తనకు సంబంధించిన శక్తి. - కౌమారి:
కుమారస్వామి (స్కంద) భార్య. యుద్ధానికి, పరాక్రమానికి సంబంధించిన శక్తి. - వారాహి:
విష్ణుమూర్తి వరాహావతారం భార్య. ధైర్యానికి, శక్తికి సంబంధించిన శక్తి. - ఇంద్రాణి:
ఇంద్రుడి భార్య. పాలనకు, అధికారానికి సంబంధించిన శక్తి. - చాముండ:
దుర్గాదేవి అవతారం. కాలానికి, మరణానికి సంబంధించిన శక్తి.
వీరిని శక్తి స్వరూపాలుగా, సృష్టి, స్థితి, లయలకు కారకులుగా భావించి భక్తులు పూజిస్తుంటారు. వారిని పూజించడం వలన భక్తులకు శక్తి, ధైర్యం, విజయం, రక్షణ లభిస్తాయని నమ్ముతారు. ఒడిశాలోని జాజ్పూర్లో బైతరణి నది దక్షిణ ఒడ్డున సప్తమాతృక ఆలయం ఉన్నది.ఈ ఆలయం ప్రత్యేకంగా సప్తమాతృకలకు అంకితం చేయబడింది. మరో పోస్టులో ఆ ఆలయం గురించి తెలుసుకుందాం.
photo courtesy…. aravind arya pakide