వణికిస్తున్న మార్బర్గ్ వైరస్ !

Sharing is Caring...

More dangerous than Corona……………………………………

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించింది. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. ఇపుడిపుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ క్రమంలో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని కొద్ది రోజుల క్రితమే డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది.మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచూశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్ ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ప్రస్తుతానికి దీనికి ‘డిసీజ్-ఎక్స్’ అనే పేరు పెట్టారు. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరు. కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆ మధ్య గినియా , ఘనా లో కొన్ని కేసులు నమోదు అయ్యాయి. మూడు నాలుగు మరణాలు కూడా సంభవించాయి. మార్బర్గ్ వైరస్ జ్వర లక్షణాలతో మొదలవుతుంది. మార్బర్గ్ వైరస్ కారణంగా తీవ్రమైన రక్తస్రావం కలుగుతుంది. అవయవాల పనితీరు మందగిస్తుంది. మరణానికి దారితీస్తుంది.

ఈ డిసీజ్-ఎక్స్ కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా లేదు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

డబ్ల్యూహెచ్ ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్ ఎక్స్ కేసులు పెరిగి ప్రపంచమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే  భయంకరం గా ఉంటుంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!