ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …
తెలంగాణ లోని మహబూబ్నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి. ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, …
అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు. ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …
రమణ కొంటికర్ల… ……………………………. ఔ మల్ల.. అసైన్ భూములను కబ్జాకెట్టి … అటవీ భూముల్లో చెట్లు కొట్టేస్తే.. నేరం కాదా..? అలా అన్జెప్పి 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవలందించాడని.. ఉద్యమంలో చురుకైన పాత్ర అన్జెప్పి… నేరమని తెలిసాక పదవిలో ఉంచడం అంతకంటే తప్పు కాదా..? అసలు అది నైతి’కథేనా’..? మరిన్నేళ్లదాకా ఆ భూముల కబ్జా …
రమణ కొంటికర్ల ………………………………. అది నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేని తంగిడి అనే మారుమూల గ్రామం. అక్కడో రేషన్ షాప్ ఓనర్ కు ఇష్టమైనప్పుడే రేషనిచ్చేది. లేకుంటే బందువెట్టేది. ఎవరికన్నా ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తే… అసలు రేషనే ఇవ్వ… ఎవ్వరికి చెప్పుకుంటరో చెప్పుకోండని ఉల్టా బెదిరించే మోరుజోపు డీలర్ …
వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది. కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి. అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపుల్లో అత్తింటి మీద కంటే పుట్టింటి పైనే ప్రేమ చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తకపోవడం విచారకరం. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.ఇదేమి బడ్జెటో …
తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి వారికి పానకాల …
error: Content is protected !!