ఏం పిల్లో ఎల్ద మొస్తవా !

Sharing is Caring...

 Vangapandu ……………………………..

“ఏం పిల్లో ఎల్ద మొస్తవా?” అని వంగపండు తను గజ్జె కట్టి ఆడుతూ పాడుతుంటే …..  ఎక్కడి జనాలు అక్కడ ఆగిపోయేవారు.  ఎటు నుంచి ఆ పాట వస్తుందో గమనించుకుంటూ అక్కడి కెళ్లి ఆ పాట మాధుర్యాన్ని ఎంజాయ్ చేసేవారు. వంగపండు ఎంత ప్రతిభావంతుడైన కళాకారుడో,ఆయన పాట అంత ప్రభావవంతమైనది.జనాలను ఇట్టే అయిస్కాంతంలా ఆకర్షిస్తుంది. కట్టి పడేస్తుంది. 

వంగపండు పాటలు ఉత్తరాంధ్ర ప్రత్యేక భాషకి చిరునామాగా మారిపోయాయి. వంగపండు ప్రతి పాటలో తాత్వికమైన ఫిలాసఫీ ఉంటుంది.  వంగపండు కార్మికుడు .. ఉద్యమాన్ని సాహిత్యాన్ని చూసాడు .. 78 ఏళ్ళు ప్రజల కోసం బతికినోడు. అలాంటి ప్రజాగాయకుడి పేరిట ఏపీ సర్కార్ స్మారక అవార్డు ను ప్రవేశ పెట్టింది.  ప్రధమ వర్ధంతి సందర్భంగా జానపద కళాకారుడు బాడ సూరన్న (శ్రీకాకుళం జిల్లా మందస మండలం )కు వంగపండు పురస్కారాన్నిఅందజేశారు.

విప్లవ కవి వంగపండు ప్రసాదరావు గురించి చెప్పుకోవాలంటే ….  పదునైన పదాలకు సొంపైన బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు  శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు.తన పాటలతో ఉత్తరాంధ్ర జానపద శైలిని తెలుగు నేల అంతటికీ పరిచయం చేశారు. తన పాటలు, రచనలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.

వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు.విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా పనిచేస్తూ ఆయన ప్రజా ఉద్యమాలవైపు నడిచారు. అనంతర కాలంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ప్రజా ఉద్యమాలకే కేటాయించారు. 1969 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగిన గిరిజన, రైతాంగ పోరాట కాలంలో ఆయన తన కళా ప్రదర్శనలతో ప్రజాదరణ పొందారు. ఆయన పాటలు ఎన్నో సినిమాల్లో వాడుకున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో దివంగత వంగపండు ప్రసాద్‌ విగ్రహాన్ని4-8-22 న విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసారు.

post updated

6-8-2022

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!