కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

దక్షిణాదిన దీదీ పోస్టర్లు … పీకే వ్యూహమేనా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని  పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ  ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే. కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే  తమిళనాడులోని  కొన్ని ప్రాంతాల్లో …

ఒకే జిల్లా.. కానీ పూర్తి కాలం పదవిలో కొనసాగని సీఎంలు!

కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని అవకాశం శివమొగ్గ జిల్లాకు దక్కింది. శివ మొగ్గ నుంచి నలుగురు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు.యడియూరప్ప అయితే ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయనతో పాటు కడిదాల్ మంజప్ప,ఎస్. బంగారప్ప, జె.హెచ్ పటేల్ సీఎం లుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.తమాషా ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా పూర్తికాలం …

కోట్ల రూపాయల ఆదాయాన్నివదిలేసి ..సన్యాసినిగా ….

ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి  జైన సన్యాసిని గా మారిపోయింది.  ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్‌ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …

వివాదమైతే హిట్ కొట్టొచ్చా ?

రమణ కొంటికర్ల ……………………………………………………..  ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే…  అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి. …

లాభాల బాటలో దూసుకుపోతున్న స్టేట్ బ్యాంక్ !

అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర …

ఎఱ్ఱ చందనం కూలీల కథ !

Nirmal Akkaraju …………………………………..  ఎఱ్ఱ చందనం ప్రపంచంలోనే అరుదైన చెట్టు. బడా స్మగ్లర్లు ఆ చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తెర వెనుక వారుండి కూలీలచేత చెట్లు నరికిస్తుంటారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. చెట్లు నరకడం నుంచి .. ఆ దుంగలను ఎలా రవాణా చేయాలో కూలీలకు …

ఆ నగరం కొన్నాళ్ళకు మాయమై పోతుందా ?

Population is decreasing ................... ఆ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి.అక్కడ కార్లు ఉండవు. పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు , ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కార్లు వాడకపోవడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా గత 50 సంవత్సరాలలో జనాభా 1,20,000 నుంచి 60 వేలకు పడిపోయింది. 2030 నాటికి ఈ నగరం దెయ్యాల …

మోటుపల్లి లో కాకతీయుల తమిళ శాసనం !

 Tamil inscription of the Kakatiyas!………………………………….. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి …

ఇన్వెస్టుమెంట్ కి అనుకూలం .. బిర్లా కార్పొరేషన్‌ !

‘బిర్లా కార్పొరేషన్‌’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …
error: Content is protected !!